close
Choose your channels

'యన్.టి.ఆర్' కి నిత్యా నో చెప్పిందా?

Sunday, February 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా యన్.టి.ఆర్` పేరుతో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నంద‌మూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఎన్టీఆర్ జీవితంలోని సినీ, రాజకీయ రంగాలకు సంబంధించిన పాత్రలకి.. నటులను ఎంపిక చేయడం చిత్ర యూనిట్‌కు తలకి మించిన భారంగా మారుతోంది.

ఇప్పటికే నటుల ఎంపిక కోసం తేజ ఫేస్ రికగ్నేషన్ పద్ధతిని అవలంబించినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే...ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం ఇటీవ‌ల కేర‌ళ‌కుట్టి నిత్యా మీనన్‌ను సంప్రదించారట‌ దర్శకుడు. ఆమె కూడా ఈ పాత్ర కోసం మొదట‌ ఆసక్తిని కనబరచిన‌ప్ప‌టికీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇప్పుడు సున్నితంగా నో చెప్పింద‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈ పాత్ర కోసం మరొక నటీమణిని అన్వేషించే ప‌నిలో పడింది చిత్ర బృందం. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం త్వరలోనే చిత్రీకరణ జరుపుకోనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.