శర్వానంద్ ముందుకు జరిగాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్ కాస్త ముందుకు జరిగాడు. ఆగస్టు 2 కి బదులు జులై మూడో వారానికి ఆయన టార్గెట్ చేస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం సినిమా ఆగస్ట్ 2న విడుదల కానుందని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. అయితే పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ చిత్రం విడుదల జులై మూడో వారంలో ఉండనున్నట్టు అర్థమవుతోంది. గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. కాజల్, కల్యాణి ప్రియదర్శి నాయికలు.
ఈ సినిమాలో శర్వా లుక్కి ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. సూర్యదేవరనాగవంశీ నిర్మాత. షూటింగ్ అంతా పూర్తయింది. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు శర్వానంద్కు సోమవారం భుజానికి శస్త్ర చికిత్స జరగనుంది. దీని కారణంగా 96 సినిమా షూటింగ్ లేటు కావచ్చేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.