హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. తొలిసారిగా గ్రీన్ ఛానల్..

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

హైదరాబాద్ మెట్రో ఓ మహాత్కార్యానికి వేదిక కాబోతోంది. తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సలో తన వంతు సాయాన్ని అందించబోతోంది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో వైద్యులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించనున్నారు. డాక్టర్ గోకులే ఆధ్వర్యంలో జరగనున్న ఈ శస్త్ర చికిత్స కోసం వైద్యులు మెట్రో సాయం తీసుకోనున్నారు. వైద్యుల కోరిక మేరకు అధికారులు సైతం మెట్రోలో గుండెను తరలించేందుకు అవసరమైన సాయం అందిస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన ఓ 45 ఏళ్ల రైతు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు రైతుకు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అవయవదానం చేసేందుకు సదరు రైతు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. కట్ చేస్తే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఓ వ్యక్తి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రెయిన్ డెడ్ అయిన రైతు గుండెను ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించాల్సి ఉంది.

అయితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పని లేదు. భారీగా పెరిగిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసి గుండెను తరలించడం చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి మెట్రో సాయం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో నగరంలో మొదటిసారిగా మెట్రోతో గ్రీన్ ఛానల్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం నాగోలు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకూ మెట్రో సర్వీసును నాన్ స్టాప్‌గా నడపనున్నారు. ఇక చెక్‌పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకూ రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించనున్నారు.

More News

`లవ్‌స్టోరీ` `టక్ జగదీష్` సినిమాల మధ్య వివాదం సమసినట్టేనట..

`లవ్‌స్టోరీ`, `టక్ జగదీష్` సినిమాల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య విడుదల తేదీల విషయంలో వివాదం తలెత్తింది.

వినూత్నంగా వివాహం.. ముక్కున వేలేసుకుంటున్న నెటిజనం..

వివాహం అనేది జీవితంలో ఒక కీలకాంశం. దీనిని చాలా ప్రత్యేకంగా జరుపుకోవాలని ఎవరికుండదు?

జైలులో పద్మజ కేకలు.. భయపడుతున్న తోటి ఖైదీలు

మదనపల్లె జంట హత్యల కేసులో నిందితుల తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది.

‘సలార్’ కోసం శ్రుతి హాసన్ ఎంత డిమాండ్ చేసిందంటే..

విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన శ్రుతి హాసన్..

ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రారంభం..

స్టార్ హీరో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.