విశాల్ మూవీలో విలన్ గా నటిస్తున్న హీరో....

  • IndiaGlitz, [Monday,October 17 2016]

విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో సినిమాల‌ను నిర్మిస్తూ, న‌టిస్తున్న విశాల్ ఇప్పుడు ఒక్క‌డొచ్చాడు(త‌మిళంలో క‌త్తిసండై) సినిమాను న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో తుప్ప‌రివాల‌న్ అనే మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాల‌తో పాటు మిత్ర‌న్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇరుండు తిరై అనే సినిమాలో యాక్ట్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో మ‌రో హీరో ఆర్య విల‌న్‌గా చేస్తున్నాడు. గ‌తంలో విశాల్‌, ఆర్య హీరోలుగా బాల ద‌ర్శ‌క‌త్వంలో వాడు-వీడు సినిమా చేశారు. ఇప్పుడు ఇరుంబు తిరై సినిమాలో ఆర్య విల‌న్‌గా చేయ‌నున్నాడు. త‌ర్వ‌లోనే సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది.

More News

రాజ్ తరుణ్ తో మూడోసారి....

వరుస విజయాల మీదున్నయంగ్ హీరో రాజ్ తరుణ్ సెలక్టెడ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ సాగిపొతున్నాడు.లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి చిత్రంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

అమ్మోరు, అరుంధతిలా...నాగభరణంను ఆదరిస్తున్నారు! - మల్కాపురం శివకుమార్

నాగభరణం చిత్రం చక్కటి ఓపెనింగ్స్ను సాధిస్తోంది.అమ్మోరు,అరుంధతి స్థాయిలో గ్రాఫిక్స్తో కూడిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు అని అన్నారు మల్కాపురం శివకుమార్.

బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ కు భారీ ఫ్లాన్..!

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు బాహుబలి2 రెడీ అవుతుంది.

ధృవ టీజర్ - 3 మిలియన్స్ రికార్డ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ధృవ.