close
Choose your channels

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యాక్సిడెంట్‌లో హీరో సోదరుడు దుర్మరణం

Wednesday, December 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యాక్సిడెంట్‌లో హీరో సోదరుడు దుర్మరణం

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు, కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌లు మరణించగా.. నిన్న గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి తేరుకోక ముందే తెలుగు చిత్ర సీమలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. యువ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. బుధవారం ఉదయం క‌డ‌ప జిల్లా చెన్నూరు వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో రామాంజులు రెడ్డి తీవ్ర గాయాలతో మృతిచెందారు. దీంతో కిరణ్ అబ్బవరం కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కిర‌ణ్.. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఆయ‌న క‌థ అందించిన ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా యువతలో కిరణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఆయన హీరోగా కొత్త చిత్రాన్ని సైతం పట్టాలెక్కించారు. భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ , మత్తు వదలరా వంటి సినిమాను నిర్మించిన క్లాప్ ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో మూవీని తెరకెక్కిస్తున్నాయి. రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. అలా కెరీర్‌లో మంచి జోష్‌లో వున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు త‌మ్ముడి మ‌ర‌ణం ఒక షాక్‌గానే చెప్పవచ్చు. రామాంజులు రెడ్డి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.