Nagarjuna : లీడర్‌గా నటిస్తా కానీ.. లీడర్ మాత్రం కాను, పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన నాగార్జున

  • IndiaGlitz, [Friday,September 30 2022]

వైసీపీ అభ్యర్ధిగా, విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున. ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై హల్‌చల్ చేస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు. రాజకీయాలకు తాను దూరంగా వున్నానని.. ఏ పార్టీతో సంబంధం లేదని, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని నాగార్జున తేల్చిచెప్పారు. అయితే మంచి స్క్రిప్ట్ వుంటే పొలిటికల్ లీడర్‌గా మాత్రం నటిస్తానని నాగ్ పేర్కొన్నారు. గడిచిన పదిహేనుళ్లుగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతోందని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌కు కొరకరాని కొయ్యగా బెజవాడ:

తనకు కొరకరాని కొయ్యగా వున్న విజయవాడ లోక్‌సభ స్థానంలో ఎలాగైనా ఈసారి వైసీపీ జెండా ఎగురవేయ్యాలని సీఎం జగన్ భావిస్తున్నారు. 2019లో జగన్ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలోనూ ఇక్కడ గెలవాలని జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. తన సన్నిహితులు పొట్లూరి వరప్రసాద్, కోనేరు రాజేంద్ర ప్రసాద్‌లను జగన్ బెజవాడ నుంచి బరిలో దించారు. కానీ రెండుసార్లూ నాని చేతిలో ఓడిపోవాల్సి వుంది. మూడోసారి కూడా కేశినేనియే ఇక్కడి నుంచి బరిలో దిగుతారని, లేనిపక్షంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టికెట్ దక్కే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి.

కమ్మ సామాజిక వర్గం, లోకల్, సినీ గ్లామర్... అందుకే నాగార్జున:

విజయవాడ లోక్‌సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా వుంది. అన్నింటికీ మించి కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఇక్కడ అధికం. బెజవాడ నుంచి ఎవరు గెలిచినా అది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. దీనిని దృష్టిలో వుంచుకుని నాగార్జునను జగన్ ఎంపిక చేశారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సినీ గ్లామర్‌, కమ్మ సామాజిక వర్గం, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పైగా కృష్ణా జిల్లాకే చెందిన వ్యక్తి కావడంతో నాగార్జునని బరిలోకి దింపాలని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాను రాజకీయాలకు దూరంగా వున్నట్లు అక్కినేని నాగార్జున స్వయంగా ప్రకటించారు.

More News

Harihara Veera Mallu: ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ లో 'హరిహర వీర మల్లు'

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట.

Satyadev: సత్యదేవ్ 26 చిత్రం ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ ప్రారంభం

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.

Adipurush: 'ఆదిపురుష్' పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

'జూనియర్' సినిమా టైటిల్ విడుదల

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా

BiggBoss: చంటి vs గీతూ.. గువ్వ పగులగొడతానన్న ఆదిరెడ్డి, ప్రేక్షకుల్ని ఏడిపించిన రేవంత్

బిగ్‌బాస్ హౌస్‌లో రెండ్రోజులుగా జరుగుతోన్న హోటల్ టాస్క్‌కి ఎండ్ కార్డ్ పడింది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది.