రోడ్డుపై ఆ సీడీలు చూసి షాకైన హీరో నిఖిల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో వాయిదాలు, వివాదాల అనంతరం నిఖిల్ సిద్దార్థ్, లావణ్య త్రిపాఠి నటించిన ‘అర్జున్ సురవరం’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. వెరైటీ చిత్రాలను ఎంచుకోవడంలో ముందుండే యువ హీరోల్లో నిఖిల్ ముందువరుసలో ఉంటాడు. ఆయన సినిమాలను కాస్త గమనిస్తే కథలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రీ-రిలీజ్ ఈవెంట్కు రావడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రిలీజ్ నాటి నుంచి ఇప్పటి వరకూ గట్టిగానే కాసుల వర్షం కురుస్తోంది.
షాకైన నిఖిల్!
ఈ క్రమంలో గుంటూరులో సినిమా సక్సెస్ టూర్ కోసం చిత్రబృందం వెళ్లింది. అయితే కార్యక్రమాలన్నీ ముగించుకుని తిరిగొస్తుండగా.. హైవేపై టీ కొట్టు దగ్గర నిఖిల్ ఆగాడు. అయితే పక్కనే ఉన్న ఓ బండిపై సీడీలు అమ్ముతున్నాడు. ఈ సీడీల్లో ‘అర్జున్ సురవరం’ సినిమా ఉండటాన్ని చూసి షాకయ్యాడు. ఈ క్రమంలో అక్కడున్న జనాలను, సీడీలు అమ్మే వ్యక్తిని సినిమా చూశారా అని అడగ్గా.. అవును డీవీడీల్లో చూశామని చెప్పడంతో ఒకింత ఆవేదనకు లోనయ్యాడు.
దయచేసి ఇలా చేయకండి!
ఈ సందర్భంగా వారితో నిఖిల్ ఇలా అన్నాడు.. ‘ఎందుకిలా చేస్తున్నారు..? ఎంతో ఖర్చు చేసి తీస్తాం.. వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి బతుకుతున్నాయి. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు. పైరసీ కారణంగా సినిమా థియేటర్లకు జనం రావట్లేదు. ఇలాంటి పరిణామాలతో చిత్రరంగం దెబ్బతింటుంది. దీంతో ఆ సినిమాపై ఆధారపడి బతుకుతున్న వేలాదిమంది బతుకులు రోడ్డునపడతాయి.. దయచేసి ఇలా చేయకండి ప్లీజ్’ అని నిఖిల్ వారికి చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.