రోడ్డుపై ఆ సీడీలు చూసి షాకైన హీరో నిఖిల్..!

  • IndiaGlitz, [Sunday,December 08 2019]

ఎన్నో వాయిదాలు, వివాదాల అనంతరం నిఖిల్ సిద్దార్థ్, లావణ్య త్రిపాఠి నటించిన ‘అర్జున్‌ సురవరం’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. వెరైటీ చిత్రాలను ఎంచుకోవడంలో ముందుండే యువ హీరోల్లో నిఖిల్ ముందువరుసలో ఉంటాడు. ఆయన సినిమాలను కాస్త గమనిస్తే కథలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రిలీజ్ నాటి నుంచి ఇప్పటి వరకూ గట్టిగానే కాసుల వర్షం కురుస్తోంది.

షాకైన నిఖిల్!

ఈ క్రమంలో గుంటూరులో సినిమా సక్సెస్ టూర్‌ కోసం చిత్రబృందం వెళ్లింది. అయితే కార్యక్రమాలన్నీ ముగించుకుని తిరిగొస్తుండగా.. హైవేపై టీ కొట్టు దగ్గర నిఖిల్ ఆగాడు. అయితే పక్కనే ఉన్న ఓ బండిపై సీడీలు అమ్ముతున్నాడు. ఈ సీడీల్లో ‘అర్జున్ సురవరం’ సినిమా ఉండటాన్ని చూసి షాకయ్యాడు. ఈ క్రమంలో అక్కడున్న జనాలను, సీడీలు అమ్మే వ్యక్తిని సినిమా చూశారా అని అడగ్గా.. అవును డీవీడీల్లో చూశామని చెప్పడంతో ఒకింత ఆవేదనకు లోనయ్యాడు.

దయచేసి ఇలా చేయకండి!

ఈ సందర్భంగా వారితో నిఖిల్ ఇలా అన్నాడు.. ‘ఎందుకిలా చేస్తున్నారు..? ఎంతో ఖర్చు చేసి తీస్తాం.. వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి బతుకుతున్నాయి. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు. పైరసీ కారణంగా సినిమా థియేటర్లకు జనం రావట్లేదు. ఇలాంటి పరిణామాలతో చిత్రరంగం దెబ్బతింటుంది. దీంతో ఆ సినిమాపై ఆధారపడి బతుకుతున్న వేలాదిమంది బతుకులు రోడ్డునపడతాయి.. దయచేసి ఇలా చేయకండి ప్లీజ్’ అని నిఖిల్ వారికి చెప్పాడు.

More News

'సరిలేరు నీకెవ్వరు' సూపర్ మెలోడీ సెకండ్ సాంగ్

సూపర్ స్టార్ ష్మహే బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్  'సరిలేరు నీకెవ్వరు' తో సంక్రాంతికి రానున్నారు.

జనసైనికులు ఇలా చేయడం వల్లే ఓటమి..12న నిరాహారదీక్ష!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత ఒకచోట కాదు రెండు చోట్ల పోటీ చేసినా గెలవని పరిస్థితి.

'డిటియస్' మూవీ ప్రారంభం

కొత్త కాన్సెప్ట్ లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు. కొత్త కాన్సెప్ట్ తో యంగ్ టీం తో డిటియస్ మూవీ ప్రారంభం లాంఛనంగా జరిగింది.

డిసెంబర్ 27న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' విడుదల

రాహుల్ మూవీ మేకర్స్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

సీఎం జగన్ సీరియస్.. ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా!?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కలకలం రేగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో భూకంపం సృష్టిస్తున్నాయి.