ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోయినా మాకేం బాధలేదు.. కానీ : రామ్‌చరణ్ హాట్ కామెంట్స్

  • IndiaGlitz, [Thursday,January 13 2022]

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. జూనియర్ ఎన్టీఆర్- రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ రావాల్సింది. కానీ దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటం.. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడపాలని ప్రభుత్వాలు హుకుం జారీ చేయడం ఆర్ఆర్ఆర్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి వెనక్కి లాగాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కావడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని ప్రస్తుత పరిస్ధితుల్లో ఆర్ఆర్ఆర్‌ను రిలీజ్ చేయలేమని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మెగా- నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ వాయిదాపై స్పందించారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. స్టార్ ప్రొడ్యూసర్ శిరీష్‌ తనయుడు ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్‌’. హర్ష కొనుగంటి దర్శకుడు. దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ‘మ్యూజికల్‌’ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకపోయినా తమకు బాధ లేదన్నారు. ఆ సినిమా సరైన సమయంలో రావాలని.. దాని కోసం దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డామని రామ్ చరణ్ అన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదల ఎప్పుడు అనేది రాజమౌళి, దానయ్య నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి మాకేంత ముఖ్యమో తెలియదు గానీ దిల్ రాజుకి చాలా ముఖ్యం అని రామ్‌చరణ్‌ అన్నారు.

ఇక ‘‘ఆర్ఆర్ఆర్’’లో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

More News

అల వైకుంఠపురానికి రెండేళ్లు : ఒక్క హిట్టు.. ‘‘పూజా’’ని స్టార్ హీరోయిన్‌ని చేసింది

కొన్ని సినిమాలు కొందరి కోసమే పుడతాయి. అవి కూడా చరిత్రను తిరగరాసేవిగానో, ఎదుగుబొదుగు లేని జీవితానికి మంచి బూస్ట్ ఇచ్చేలాంటివో అవుతాయి.

మహమ్మారి కమ్ముకొస్తుంటే.. కొవిడ్‌ నిబంధనలు గాలికి, 1500 మంది కలిసి కోతి అంత్యక్రియలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 విశ్వరూపం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ భారీ స్థాయిలో కేసులతో యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాలు వణికిపోతున్నాయి.

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం, మృతులు వైసీపీ ఎమ్మెల్యే బంధువులు

గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో తల్లికూతుళ్లు కాలువలో గల్లంతయ్యారు. వీరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడి భార్యాపిల్లలు.

అసలే చలితో గజగజ... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, అక్కడక్కడా వడగండ్ల వానలు

అసలే చలితో వణుకుతుంటే.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు వార్త చెప్పింది. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని..

కృష్ణా జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన ఈత సరదా, మున్నేరులో మునిగి ఐదుగురు బాలురు మృతి

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మున్నేరులో ఐదుగురు విద్యార్థులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.