ర‌వితేజ‌కు విల‌న్‌గా మారిన హీరో

  • IndiaGlitz, [Thursday,December 03 2020]

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే ‘క్రాక్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ర‌వితేజ‌.. ఇప్పుడు ‘ఖిలాడి’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ర‌వితేజ‌ను ఢీ అండే ఢీ అనే విల‌న్‌గా సీనియ‌ర్ స్టార్.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టిస్తున్నాడు. అర్జున్ కూడా రీసెంట్‌గా సెట్స్‌లో జాయిన్ అయ్యాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. సెకండ్ ఇన్నింగ్స్‌లో యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ న‌టిస్తున్నాడు. నితిన్ లై, విశాల్ అభిమాన్యుడు చిత్రాల్లో విల‌న్‌గా అర్జున్ మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అర్జున్ త‌న విల‌నిజాన్ని చూపించ‌డానికి రెడీ అయ్యాడు.

ఈ చిత్రాన్ని జయంతి లాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తమిళ చిత్రం చతురంగవేట్టై 2కి తెలుగు రీమేక్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

More News

కోవిడ్ ఎఫెక్ట్‌... ‘పుష్ప’ షూటింగ్ క్యాన్సిల్‌

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

రేస్ టు ఫినాలే.. ఫైనల్ రౌండ్‌లో సొహైల్, అఖిల్..

‘ఖేలో ఖేలో ఖేలోరే.. ’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. సొహైల్‌ని కూర్చోబెట్టి అవినాష్.. మోనాల్ తన్నడం గురించి చెప్పి బాధ పడ్డాడు.

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న స్టార్ క‌మెడియన్‌సునీల్‌.. ?

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి524’

కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు.

కొత్త సినిమా మొదలు పెట్టిన హీరో టైసన్ రాహుల్

శ్రీమతి దివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్ పతాకం పై రాహుల్, చేతన్,సాక్షి చౌదరి,ఐశ్వర్య,యమీ నటీనటులుగా విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో