శంకర్ సినిమాలో రామ్ చరణ్‌కు హీరోయిన్ సిద్ధం!

  • IndiaGlitz, [Wednesday,March 24 2021]

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ చేస్తూ వెళుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ తదుపరి చిత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో చేస్తున్న చెర్రీకి ఈ సినిమా షూటింగ్ ముగియక ముందే శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో చెర్రీ నటించబోతున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సినిమా ప్రకటనకు సంబంధించి న్యూస్ వచ్చిన నాటి నుంచే మెగాభిమానులు, ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ న‌టించ‌నున్నట్టు సమాచారం‌. కియార ఓ రిపోర్ట‌ర్ పాత్రలో క‌నిపించ‌నుంద‌ని టాక్. ఇప్పటికే కియారా.. చెర్రీతో కలిసి ‘వినయ విధేయ రామ’లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల వైపు తిరిగి చూడలేదు. తిరిగి చెర్రీతోనే కలిసి నటించేందుకు కియారా సిద్ధమవుతోందని సమాచారం. అంతకు ముందు కియారా.. ‘భరత్ అనే నేను’ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం శంక‌ర్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి శంకర్, కమల్‌హాసన్ కాంబోలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది అయితే వివిధ కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. దీంతో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది నిలిచిపోయింది. కమల్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈలోగా శంకర్.. చెర్రీతో చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవగానే చెర్రీ కూడా శంకర్‌తో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతాడని సమాచారం.

More News

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. పలు రాష్ట్రాల్లో ఇలా..

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలో ఎన్ని కేసులైతే నమోదయ్యాయో..

ఏ క్షణమైనా థియేటర్లు మూతపడతాయట...

మళ్లీ పరిస్థితులు మొదటికి వస్తున్నాయి. గత ఏడాది మార్చిలో మొదలైన అనూహ్య పరిస్థితులు..

ఎన్టీఆర్ బావ మ‌రిది మూవీకి డేట్ ఫిక్స్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఓ హీరో తెలుగు చిత్ర సీమ‌లోకి అడుగు పెడుతున్నారు. అత‌నెవ‌రో కాదు..

కరోనా ఉధృతి.. కేంద్రం నూతన మార్గదర్శకాలివే..

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నిబంధనలు ఏప్రిల్ నెలాఖరు వరకూ కొనసాగుతాయని కేంద్రం తాజాగా ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి!

పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తైంది.