‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ రిలీజ్‌కు హైకోర్ట్ బ్రేక్

  • IndiaGlitz, [Thursday,November 28 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. రేపు అనగా.. నవంబర్ 29న రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పినప్పటికీ.. విడుదలపై మాత్రం అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. సినిమా రిలీజ్‌కు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. గురువారం నాడు ఈ సినిమాపై అందిన పిటిషన్‌లను విచారించిన హైకోర్టు.. సినిమా రిలీజ్‌ను ఆపాలని ఆదేశించింది. ఇప్పటి వరకు చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదని సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు చెప్పారు. అయితే.. వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌కు హైకోర్టు సూచించింది.

ఇదిలా ఉంటే.. రెండు కులాల మధ్య చిచ్చు రగిల్చే పరిస్థితులు ఉన్నందున వెంటనే సినిమా టైటిల్‌ను మార్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే టైటిల్‌ను మార్చామని కోర్టుకు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆర్జీవీ కోరాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు బదులుగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మారుస్తానని ఇప్పటికే ఆయన స్పష్టం చేశాడు. మొత్తానికి చూస్తే.. సినిమా రేపు రిలీజ్ కాదన్న మాట. మరి ఈ క్రమంలో ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే పలువురు ఆర్జీవీ వీరాభిమానులు, ఔత్సాహికులు సినిమా టికెట్లు బుక్ చేసుకున్నారు. మరి వారి పరిస్థితేంటి..? అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

More News

'మేరా దోస్త్' టీజర్ లాంచ్

పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం `మేరా దోస్త్`.

చిరు 150 సినిమాలు.. రూ. 300కే థియేటర్‌లో చూసేయండి!

టైటిల్ చూడగానే అవునా.. అదెలా సాధ్యం.. సీడీల్లో అయితే చూడొచ్చన్నా అది ఓ లెక్కా..! థియేటర్లలో 150 సినిమాలు అది కూడా..

బాల‌య్య విల‌న్‌గా రోజా?

నందమూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ టైటిల్‌ మార్పు

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’.

అమరావతిలో టెన్షన్.. టెన్షన్.. బాబు కాన్వాయ్‌పై చెప్పులు!

అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా చెప్పినట్లే నవంబర్-28న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు పయనమయ్యారు.