ఎన్‌.శంక‌ర్ భూముల వ్య‌వ‌హారంలో వివ‌ర‌ణ అడిగిన హైకోర్టు

  • IndiaGlitz, [Monday,August 10 2020]

గత ఏడాది టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స్టూడియో నిర్మాణానికి త‌క్కువ ధ‌ర‌కు భూములు ఇచ్చారు. ఈ వ్య‌వ‌హారంపై కోర్టులో కొన్ని నెల‌ల క్రితం కేసు న‌మోదైంది. ఇప్పుడు ఆ కేసుపై విచార‌ణ జ‌రిగింది. ‘రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని ఏ ప్రాతిప‌దిక‌న ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు కేటాయించారు? అని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. భూ కేటాయింపులు ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రగాల‌ని పేర్కొన్నా.. ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోలేదు?’అని హైకోర్టు వేసిన ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ఏజీ క్వారంటైన్‌లో ఉన్న కార‌ణంగా కోర్టును కాస్త స‌మ‌యం కావాల‌ని కోరు. దీంతో కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆగస్ట్ 27 తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

రంగారెడ్డి జిల్లామోకిల్లాలో ఎక‌రం ఐదు కోట్ల రూపాయ‌ల విలువ చేసే భూమిని, ఐదు ల‌క్ష‌ల‌కు ఏ ప్రాతిప‌దిక‌న ఎన్‌.శంక‌ర్‌కు ప్ర‌భుత్వం కేటాయించారు అని హైకోర్టు ప్ర‌శ్నించింది. కోట్ల రూపాయ‌ల భూమిని త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

More News

ర‌వితేజ నెక్ట్స్ మూవీ రీమేకా..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ‘క్రాక్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌.

ఏడాది వెన‌క్కి వెళ్లిన ఆమిర్ ఖాన్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా రిలీజ్‌లు వాయిదా ప‌డుతున్నాయి. ఇప్పుడు ఈ కోవ‌లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చ‌ద్దా’ కూడా చేరింది.

వారి నటన నన్నెంతగానో ఆకట్టుకుంది: రామ్‌చ‌ర‌ణ్‌

సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు.

సూపర్ ఫైన్‌గా ఉన్నా.. డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ: వర్మ

తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకు వర్మ డంబెల్స్‌తో సిద్ధమై పోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో చేశారు.