ఆర్జీవీ 'దిశ ఎన్కౌంటర్'ని రెండు వారాలు ఆపిన హైకోర్టు!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. వివాదాలతో కూడిన సబ్జెక్టుని డీల్ చేయడంలో వర్మకు వర్మే సాటి. లీగల్ గా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను తెరకెక్కించాలనుకున్న చిత్రం విషయంలో వర్మ వెనకడుగు వేయడు. రాంగోపాల్ వర్మ తెరవెనుక నుంచి రూపొందిస్తున్న చిత్రం దిశ ఎన్కౌంటర్.

తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా దిశ సంఘటన సంచలనం సృష్టించింది. ఆ సంఘటన ఆధారంగా వర్మ దిశ ఎన్కౌంటర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై దిశ కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ చిత్రం విడుదల కాకుండా ఆపాలని దిశ కుటుంబ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించారు.

సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శక నిర్మాతలం తామే అని ఆనంద్ చంద్ర, అనురాగ్ కోర్టుకు తెలిపారు. ఎవరికీ అభ్యంతరాలు లేకుండా ఈ చిత్ర టైటిల్ 'ఆశ ఎన్కౌంటర్ గా మార్చినట్లు చిత్ర యూనిట్ కోర్టుకు తెలిపింది. ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికేట్ జారీ చేశారు.

సినిమాపై ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ సర్టిఫికేట్ ని సవాల్ చేసేందుకు వీలుగా 2 వారాల పాటు చిత్రాన్ని వాయిదా వేయగలం అని చిత్ర యూనిట్ కోర్టుకు తెలిపింది. దీనితో న్యాయస్థానం ఈ చిత్రాన్ని 2 వరాలు విడుదల వాయిదా వేయాలని ఆదేశించింది.

హైదరాబాద్ లో 2019లో జరిగిన దిశ అత్యాచారం, హత్య సంఘటన దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది. హైదరాబాద్ పోలీసులు త్వరగానే కేసుని ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. అయితే నేరగాళ్లు తమపై దాడి చేసి తప్పించుకోవాలని ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు అప్పట్లో తెలిపారు. ఈ సంఘటనకు వర్మ తన క్రియేటివిటీ జోడించి దిశ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

More News

19 ఏళ్ల జయం.. నితిన్ భార్య మెమొరబుల్ పోస్ట్!

యూత్ స్టార్ నితిన్ నేటితో 19 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా 19 ఏళ్ళక్రితం నితిన్ నటించిన జయం మూవీ 14 జూన్, 2003 లో విడుదలయింది.

విషాదం: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. స్నేహితుడితో బైక్ పై..

కరోనా విజృంభణతో సినీ ప్రముఖులు చాలా మంది ప్రాణాలు వదిలారు. ఇది చాలదు అన్నట్లు కొన్ని దురదృష్ట సంఘటనలు కూడా సినీ ప్రముఖుల ప్రాణాలు బలిగొంటున్నాయి.

చిరంజీవి మానవత్వానికి కేంద్రమంత్రి ఫిదా!

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.

జమ్మూలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన.. జగన్ నిర్ణయంతో హిందూ ధర్మ ప్రచారం

టిటిడి చరిత్రలో ఇది కొత్త మైలు రాయి అని చెప్పొచ్చు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడింది.

ధైర్యంగా పని మొదలుపెట్టిన నితిన్!

నితిన్ చాలా ఇష్టపడి చేస్తున్న చిత్రం మాస్ట్రో. నితిన్ కెరీర్ లో ఇది 30వ చిత్రం. హిందీలో ఘన విజయం సాధించిన అంధాదున్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది.