ర‌కుల్ నోటీసుల విష‌యంలో హై డ్రామా..!

సినీ ప‌రిశ్ర‌మ‌కు డ్ర‌గ్ మాఫియాతో సంబంధాలున్నట్లు నార్కోటిక్ విచార‌ణ‌లో వెల్ల‌డి కావ‌డంతో అధికారులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. అందులో భాగంగా డ్ర‌గ్ మాఫియాతో డీలింగ్ ఉన్న‌ట్లు తెలిసిన సినీ సెల‌బ్రిటీలంద‌రినీ నార్కోటిక్ విభాగం విచార‌ణ‌కు ర‌మ్మ‌ని నోటీసుల‌ను జారీ చేసింది. ఈ కేసులో ఇప్ప‌టికే హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తిని అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే రాగిణి ద్వివేది, సంజ‌న‌ల‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌కి చెందిన దీపికా ప‌దుకొనె, సారా అలీఖాన్‌లతో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో ఎన్‌సీబీ అధికారులు ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

కానీ ర‌కుల్‌కు ఎన్‌సీబీ అధికారులు జారీ చేసిన నోటీసుల విష‌యంలో పెద్ద హైడ్రామానే న‌డుస్తుంది. అధికారులేమో నోటీసులు జారీ చేశామ‌ని చెబుతుంటే.. ర‌కుల్ స‌న్నిహితులు మాత్రం ర‌కుల్‌కి ఎలాంటి నోటీసులు అంద‌లేద‌ని చెబుతున్నారు. ఎన్‌సీబీ అధికారులు ర‌కుల్‌ప్రీత్ సింగ్‌ను కాంటాక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే ఆమె అందుబాట‌లోకి రావ‌డం లేద‌ట‌. ముంబైకి చేరుకుంద‌ని అంటుంటే.. లేదు ఆమె హైద‌రాబాద్‌లోనే ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం క్రిష్ సినిమా లొకేష‌న్‌లోనూ ర‌కుల్ లేద‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

More News

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతి

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ్టి బీభత్సాన్ని చెప్పలేం.. చూసి తీరాల్సిందే..

రోబోల కిడ్నాప్ స్కెచ్‌తో షో స్టార్ట్ అయింది. అభి స్కెచ్ పర్ఫెక్ట్‌గా గీశాడు. ముందే రిహార్సల్ కూడా వేయించాడు. నిజానికి దేవి చనిపోయింది. ఆటలో ఇన్వాల్వ్ అవకూడదు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో మెగా హీరో

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లన్నీ క్రమక్రమంగా తిరిగి ప్రారంభమవుతున్నాయి. దీంతో హీరోలంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.

నానితో త్రివిక్ర‌మ్ అదే కార‌ణ‌మా..?

మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌డానికి హీరోలంద‌రూ ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠ‌పురుమ‌లో చిత్రంతో భారీ హిట్‌ను

‘ఆర్ఆర్ఆర్‌’కు జ‌క్క‌న్న రెడీ.. వ‌ర్క‌వుట్లు చేస్తున్న హీరోలు

మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ ముందు వ‌రుస‌లో ఉంది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న