రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలాఖరులో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలాఖరులో గ్రాండ్ రిలీజ్ తో మీ ముందుకు వస్తున్నాం. నా కెరీర్లో అందరూ మెచ్చుకునే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అని అన్నారు.

దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. కథలో అనేక ట్విస్టులుంటాయి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశాం. సెన్సార్ సభ్యుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. సో... చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. డిసెంబర్ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

More News

అప్పుడు ర‌చ‌యిత‌..ఇప్పుడు డైరెక్ట‌ర్‌...

వెంక‌టేష్ సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేని సినిమా 'నువ్వు నాకు న‌చ్చావ్'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కె.విజ‌య్‌భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు అందించాడు.

మ‌హేష్ సినిమా సినిమాటోగ్రాఫ‌ర్ మారుతున్నాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'( విన‌ప‌డుతున్న పేరు). కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 27న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

విశాల్ సినిమా వాయిదా?

మాస్‌ హీరో విశాల్‌ ఇటీవల విడుదలైన 'డిటెక్టివ్‌'తో మరో సూపర్‌హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'అభిమన్యుడు'.

సినిమాల్లోకి హీరోయిన్ కుమారుడు

చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు ఇటా స్టార్స్‌తో న‌టించిన హీరోయిన్ సుమ‌ల‌త అందరికీ గుర్తుండే ఉంటుంది. క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్‌ను వివాహం చేసుకుని సెటిలైంది.

'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' సక్సెస్‌ టూర్‌

సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రతం సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.