ప్ర‌భాస్‌కి దిమ్మ తిరిగే అడ్వాన్స్‌

  • IndiaGlitz, [Saturday,December 14 2019]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ హీరో అయ్యాడు. 'బాహుబ‌లి' సినిమా సాధించిన భారీ విజ‌యంతో ఇప్పుడు ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. సాహో సినిమాను ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల చేశారు. ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా చేస్తున్న జాన్ సినిమాను ప్యాన్ ఇండియా సినిమాగానే తెర‌కెక్కిస్తున్నారు. యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్ సినిమాల‌తో సినిమాలు చేస్తున్న ప్ర‌భాస్ త‌దుపరి సినిమాపై ఎవ‌రికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్ మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం మైత్రీ మూవీస్ చేతిలో క‌న్న‌డ చిత్రం 'కె.జి.య‌ఫ్‌' ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఉన్నాడు. ఆయ‌న కూడా క‌థ ప‌ట్టుకుని సినిమా చేయ‌డానికి రెక్క‌లు క‌ట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్‌తో సినిమా చేసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం ప్ర‌భాస్‌కు ఐదు కోట్ల రూపాయ‌ల చెక్ ఇచ్చిన మైత్రీ మూవీస్ సంస్థ తాజాగా మ‌రో రూ. 8 కోట్ల రూపాయ‌ల చెక్‌ను ఇచ్చింద‌ని స‌మాచారం. అంటే మొత్తంగా రూ. 13 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు.

జాన్ త‌ర్వాత ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్‌నీల్‌, మైత్రీ మూవీస్ కాంబినేష‌న్‌లోనే సినిమా ఉండే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం మైత్రీమూవీస్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 
 

More News

బాల‌య్య లిస్టులో మ‌రో హీరోయిన్‌

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న 106వ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు. బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

భార్య‌కు ఉల్లిపాయ క‌మ్మ‌లు ఇచ్చిన హీరో

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ త‌న భార్య ట్వింక‌ల్ ఖన్నా ఓ డిఫ‌రెంట్ బ‌హుమ‌తిని ఇచ్చారు. ఇంత‌కు అక్ష‌య్‌కుమార్ ట్వింక‌ల్‌కు ఇచ్చిన బ‌హుమ‌తి ఏంటో తెలుసా? ఉల్లిపాయ క‌మ్మ‌లు.

జగన్ మరో కీలక నిర్ణయం: డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు

అవును మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి

‘హీ ఈజ్ సో క్యూట్’.. మహేశ్‌పై రష్మిక టిక్ టాక్ వీడియో

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

పెళ్లి వదంతులపై క్లారిటీ ఇచ్చేసిన కాజల్

సినీ ఇండస్ట్రీలో మోస్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో.. టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన కాజల్ అగర్వాల్ కూడా ఉంది.