close
Choose your channels

పాట కోసం ఐదు కోట్ల రూపాయలా?

Saturday, November 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాట కోసం ఐదు కోట్ల రూపాయలా?

ఈ మధ్య సినిమాలో భాగమైన భారీ సెట్స్‌కు భారీగా ఖర్చు పెడుతున్నారంటేనే అబ్బో అని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్‌ చాలానే మారింది. ఇప్పుడు ట్రెండ్‌ సింగిల్‌ పాటకే కోట్ల దాటేస్తున్నాయి. ఉదాహరణకు సాహో సినిమాలో క్లైమాక్స్‌ ఫైట్‌కు రూ.70 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇలా ఖర్చు పరిమితులు దాటేస్తున్నాయి. అసలు విషయానికి వస్తే బన్నీ లేటెస్‌ మూవీ అల..వైకుంఠపురములో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రెండు సాంగ్స్‌ విడుదలయ్యాయి. అందులో రీసెంట్‌గా విడుదలైన రాములో రాముల.. సాంగ్‌ కోసం చిత్ర నిర్మాతలు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు వార్తలు వినపడుతున్నాయి.

సినిమాలో ఈ పాట కోసం భారీ సెట్‌ను వేశారట. ఈ సెట్‌ కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని టాక్‌. అలాగే, సినిమాలో మెయిన్‌ ఆర్టిస్టులందరూ ఈ పాటలో పాల్గొన్నారు. అందరి మేకప్‌ల కోసం ముంబై నుండి ఓ స్పెషల్‌ బ్యాచ్‌ దిగిందట. ఈ పాటకు ఇలా ఎక్స్‌ట్రా ఖర్చు రెండు కోట్ల రూపాయలు అయినట్లు టాక్‌ వినపడుతుంది. ఓ పాటకే ఇంత ఖర్చు పెట్టారంటే సినిమాకు ఇంకెంత ఖర్చు పెట్టి ఉంటారనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. అయితే ఈ పాట మాత్రం సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. కాబట్టి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టుబ, జయరాం, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 12న విడుదలవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.