కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

  • IndiaGlitz, [Friday,November 06 2020]

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతోందన్నారు. తెలంగాణ పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను తన దావోస్ పర్యటన‌లో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్(‌ఏడబ్ల్యూఎస్) రాష్ర్టంలో రూ.20,761 కోట్ల పెట్టుబ‌‌డులు పెట్ట‌నుందని వెల్లడించారు. అమెజాన్ సంస్థ పెట్టుబతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే నని కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ 20 వేల 761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మూడు అవైలబిలిటీ జోన్లను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్‌లో అనేక డాటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. 2022 సంవత్సర ప్రథామార్థంలో అమెజాన్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనుంది.