బ‌న్నీకి భారీ రెమ్యున‌రేష‌న్‌..?

  • IndiaGlitz, [Monday,June 22 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త‌న రేంజ్‌ను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తున్నారు. ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించిన బ‌న్నీ ఇప్పుడు ‘పుష్ప‌’తో పాన్ ఇండియా హీరోగా మారే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మ‌ల‌యాళంలోనూ మంచి క్రేజ్ ఉంది. ఎప్ప‌టి నుండో త‌మిళంలో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న సమ‌యంలో సుకుమార్ చెప్పిన పుష్ప క‌థ న‌చ్చ‌డంతో హిందీలో కూడా హీరోగా పాగా వేయ‌డానికి పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసేశాడు. ఈ సినిమా కోసం బ‌న్నీ లుక్ ప‌రంగా అంతా సిద్ధంగా ఉన్నాడు. క‌రోనా ప్ర‌భావం లేకుంటే ఈ పాటికే తొలి షెడ్యూల్ కూడా ఎప్పుడో పూర్త‌య్యుండేది. కానీ క‌రోనా ఎఫెక్ట్‌తో రెగ్యుల‌ర్ షూటింగ్ వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే షూటింగ్ షురూ చేయ‌డానికి బ‌న్నీ అండ్ టీమ్ సిద్ధ‌మ‌వుతున్నారు.

‘పుష్ప’ సినిమా కోసం బ‌న్నీ భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రానికి రూ.25 కోట్ల‌తో పాటు లాభాల్లో 25 శాతం వాటాను బ‌న్నీ తీసుకున్నార‌ని టాక్‌. ఇప్పుడు ‘పుష్ప’ కోసం రూ.35 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌తో పాటు లాభాల్లో వాటాను తీసుకుంటున్నార‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై బ‌న్నీ అండ్ టీం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

More News

నానిని మ‌రోసారి ఫిదా చేయ‌నుందా?

నేటి త‌రం యువ క‌థానాయ‌కుల్లో నేచుర‌ల్ స్టార్ నాని ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న 25వ చిత్రం ‘వి’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

సమంత పాన్ ఇండియా మూవీ..?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి.

బాల‌య్య హీరోయిన్‌కి అరుదైన అవార్డు

తెలుగు నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న లెజెండ్‌లో న‌టించిన న‌టి రాధికా ఆప్టే. ఆమెకు ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో అరుదైన అవార్డు ల‌భించింది.

మ‌హేశ్ ‘సర్కారు వారి పాట’లో చెర్రీ విల‌న్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ ఫారిన్ వెళ్తాడా?

క‌రోనాకు పెద్దా చిన్నా తేడా లేకుండా అంద‌రూ వ‌ణుకుతుంటే, ప్ర‌భాస్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?