శ్రీనివాస కళ్యాణం కోసం భారీ సెట్

  • IndiaGlitz, [Saturday,March 10 2018]

స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు, ద‌ర్శ‌కుడు సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ 'శతమానం భవతి' మంచి విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో.. తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని చాలా భావోద్వేగంగా చూపించి ప్రేక్షకుల మన్ననలను పొందడమే కాదు.. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మ‌రోసారి వీరి కాంబినేష‌న్‌లో సినిమా రానుంది. ఈసారి వివాహ బంధాన్ని తెలియజేసే కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ ద్వయం.

కాస్త వివరాల్లోకి వెళితే.. నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. రెండు కుటుంబాలు, వివాహ బంధం నేపథ్యంతో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నార‌ని స‌మాచారం.

ఈ రెండు కుటుంబాల కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్‌ వేయించారట నిర్మాత. కూనవరంలో ఈ రెండు కుటుంబాలు ఉన్నట్టు తెరపై చూపించబోతున్నారు. అలాగే ఈ కుటుంబాలకి సంబంధించి వచ్చే పెళ్లి సన్నివేశాల కోసం నెలరోజుల పాటు అక్క‌డ చిత్రీకరణ జరుపనున్నారని.. ప్రధాన పాత్రధారులంతా ఈ చిత్రీకరణలో పాల్గొనున్నారని సమాచారం.

More News

'ఛల్ మోహన్ రంగ' 'పెద్దపులి' సాంగ్ రిలీజ్

నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ" అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం వచ్చినట్టు డాన్సులు వేస్తారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఈ పాటని మన యువ కథానాయకుడు నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం "ఛల్ మోహన్ రంగ"లో రీక్రియేట్ చేస్తున్నారు.

ఇక‌నైనా డిజిట‌ల్ ఛార్జీల త‌గ్గింపు పై ప్ర‌భుత్వాలు జోక్యం చేసుకోవాలి- ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బంద్ అనేది బ్ర‌హ్మాస్ర్తం లాంటిది. అలాంటి బ్ర‌హ్మాస్త్రాన్ని ఉప‌యోగించి తెలుగు ఫిలిం చాంబ‌ర్ వారు ఏం సాధించారో అర్థం కావ‌డంలేదు.

ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న నెల్లూరి పెద్దారెడ్డి...

సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వీజే రెడ్డి రూపొందించిన చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

'రాజరథం' లో 'చల్ చల్ గుర్రం' అంటూ వస్తున్న రవి శంకర్

'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారి ఆకట్టుకునే  నైపుణ్యం తో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో  మరోసారి ఆశ్చర్యపరచనుంది.

అనుకిది గుర్తుండిపోయే సంవ‌త్స‌ర‌మే..

ఫ‌లితాల‌ సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది కేర‌ళకుట్టి అను ఇమ్మాన్యుయేల్. 2016లో 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ‌.. 2017లో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' సినిమాల్లో కథానాయికగా నటించింది.