close
Choose your channels

భార్య ‘టీ’ పెట్టలేదని భర్త ఆత్మహత్య...!

Tuesday, November 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భార్య భర్తల మద్య చికాకులు, మనస్పర్థలు సాధారణమే.. అవన్నీ దాటుకుని కొనసాగితేనే కాపురం పదికాలాల పాటు పచ్చగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.. పెళ్లయిన వారికి ఇది ఏ మాత్రం తెలుస్తుందో లేదో తెలియదు కానీ కొందరు మాత్రం చేజేతులారా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరీ చిన్న చిన్న విషయాలకు చిరాకు పడటం.. మనస్తాపానికి గురై నిండు జీవితాలను చేజేతులారా బలి చేసుకుంటున్నారు. ఇదిగో ఈ స్టోరీ చదివితే మీకే అసలు విషయం తెలుస్తుంది. భార్య టీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. చోటుచేసుకుంది.

అసలేం జరిగింది...!

పూర్తి వివరాల్లోకెళితే.. డ్యూటీ ముగించుకుని వచ్చిన భర్త.. టీపెట్టమని భార్యకు చెప్పాడు. అయితే ఇప్పుడు కుదరదు తర్వాత పెట్టిస్తానని భార్య చెప్పింది.

ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ పడిన భర్త తీవ్ర మనస్తాపానికి గురై క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. భర్త బాలయ్యనగర్‌కు చెందిన అడివయ్య (35) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు మీడియాకు వెల్లడించారు.

అయితే ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారు..? ఇందులో తప్పెవరిది..? అని పోలీసులు తేల్చబోతున్నారు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మనస్పర్థలు సర్వసాధారణమే.. చిన్నపాటి విషయాలకు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడమే పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.