నేను నీలకంఠుడ్ని.. బెదిరించే వాళ్లను లెక్క చేయను!

  • IndiaGlitz, [Friday,April 24 2020]

విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాశ్ రాజ్ సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. కాగా.. గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ హత్యానంతరం ప్రకాష్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రకాష్‌కు భద్రత కల్పించారు. అయితే తాజాగా ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బెదిరింపుల ప్రస్తావన వచ్చింది. మళ్లీ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన కింది విధంగా బదులిచ్చారు.

నేను నీలకంఠుడ్ని..

‘గతంలో నన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చేవి. అయితే నేను పిరికివాడ్ని కాదు. ఒకర్ని చంపేద్దామని భావించేవాళ్లు నా దృష్టిలో చచ్చిపోయిన వాళ్ల కిందే లెక్క. తమలోని మానవత్వాన్ని చంపేసుకుంటేనే ఎదుటివాళ్లను చంపగలరు. ఆ లెక్కన ఒకర్ని చంపాలనుకున్నవాళ్లు ఎప్పుడో చచ్చిపోయినట్టుగా నేను భావిస్తాను. ప్రస్తుతం నాకు బెదిరింపులు ఏమీ రాకపోయినా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుంటారు. రోగులను ఓ డాక్టర్ ఎలా చూస్తాడో అలాంటి విమర్శకులను నేనూ అలాగే చూస్తాను. ఇటీవల నా కుమారుడి ఫొటో పోస్టు చేస్తే నీ మనవడా అని, ఎన్నో భార్య కొడుకు అని వెటకారం చేశారు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. వాళ్ల నాలుకల్లో ఉన్న విషం అలాంటిది. నేను నీలకంఠుడ్నని, అలాంటి విషపు వ్యాఖ్యలను జీర్ణించుకోగల సత్తా నాకు ఉంది’ అని ప్రకాష్ రాజ్ ఉద్ఘాటించారు.

More News

రాజమౌళిలో అదొక్కటే నాకు నచ్చదు..: కీరవాణి

దర్శకధీరుడు, టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి అలియాస్ జక్కన్న గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది. ఈయన తెరకెక్కించిన ‘బాహుబలి’

కరోనా తర్వాత పారితోషికంపై ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..

కరోనా మమమ్మారి కాటేస్తున్న తరుణంలో సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు సర్వం బంద్ అయ్యాయి. దీంతో నిర్మాతలపై గట్టిగా దెబ్బ పడింది. బహుశా కరోనా ముందు.. కరోనా తర్వాత పరిస్థితులు

నేను ఎంత వాడినో నాకే తెలియదు : ప్రకాష్ రాజ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో లాక్ డౌన్ పొడిగించడంతో నిరుపేదలు, వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ వంతుగా

నేడు కేసీఆర్ పెళ్లి రోజు.. వెల్లువలా శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతుల పెళ్లిరోజు ఇవాళ. అంతేకాదు జోగునపల్లి రవీందర్ రావుది కూడా ఇవాళే పెళ్లిరోజు.

ఏపీలో కరోనా విజృంభణ.. అనూహ్యంగా పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందో తప్ప తగ్గట్లేదు. గడిచిన 24 గంటల్లో అనూహ్యంగా 80 పాజిటివ్ కేసులు