close
Choose your channels

ఇక‌పై న‌టించ‌ను: ఛార్మి

Monday, May 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇక‌పై న‌టించ‌ను:  ఛార్మి

హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఛార్మి అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ న‌టించింది. అయితే క్ర‌మంగా నిర్మాత‌గా మారారు. పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ఈమె సినిమాలు నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నింటీలో ఇస్మార్ట్ శంక‌ర్ భారీ హిట్‌ను సాధించింది. ఈ చిత్రం డెబ్బై కోట్ల రూపాయ‌ల మేర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇప్పుడు పూరి ఏకంగా క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

నిర్మాత‌గా మారిన ఛార్మి తాను ఇక‌పై సినిమాల్లో న‌టించ‌న‌ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ‘‘ఇక‌పై సినిమాల్లో రెండు వంద‌ల శాతం న‌టించ‌ను. కొత్త హీరోయిన్స్ వ‌స్తున్నారు. చ‌క్క‌గా పెర్ఫామెన్స్ చేస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో నేను న‌టిగా చేయాల‌ని ప‌ట్టుకుని వేలాడాల‌ని అనుకోవ‌డం లేదు. నిజానికి జ్యోతిల‌క్ష్మీ స‌మయంలో రిటెర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని అనుకున్నాను. కానీ పూరిగారు, సి.క‌ల్యాణ్‌గారు వ‌ద్ద‌ని వారించారు. సినిమాల్లో న‌టించ‌వ‌ద్దు కానీ.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌వ‌ద్దు అని అన్నారు. ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను చూడ‌టం ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు ఛార్మి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.