అఖిల్ పేరు వినగానే వెంటనే సంతకం చేసేశా: మోనాల్

  • IndiaGlitz, [Wednesday,February 17 2021]

ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్ ద్వారా బాగా హైలైట్ అయిన జంట ఏదైనా ఉందంటే అది అఖిల్-మోనాల్‌ల జంట. ఈ జంట కోసమే బిగ్‌బాస్ చూసిన వాళ్లూ లేకపోలేదు‌. బిగ్‌బాస్ కూడా వీరిద్దరినీ బాగా హైలైట్ చేస్తూ వీరిద్దరి మధ్య ఏదో కథ నడుస్తున్నట్టుగా క్రియేట్ చేసి మరీ చూపించడంతో ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సీజన్ 4 సక్సెస్‌లో వీరి పార్ట్ చాలా ఉందనే చెప్పాలి. షోలో భాగంగా ఈ జంట‌ మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు.

అయితే అఖిల్, మోనాల్‌లది ప్రేమ, స్నేహమా? అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. రియాల్టీషో అనంతరం మోనాల్‌ నటిగానే కాకుండా స్పెషల్‌ సాంగ్స్‌కు సైతం ఓకే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ఓ ప్రాజెక్ట్‌ కోసం అఖిల్‌తో కలిసి నటించేందుకు సిద్ధమైంది. భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో ‘తెలుగు అబ్బాయి.. గుజరాత్‌ అమ్మాయి’ అనే వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోంది.

ఈ వెబ్ సిరీస్‌లో అఖిల్, మోనాల్‌ల జంట సందడి చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌ మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఒప్పుకోవడానికి గల కారణాలను తాజాగా మోనాల్‌ వెల్లడించింది. ఈ సిరీస్‌ గురించి కొన్ని రోజుల క్రితమే తనను దర్శక, నిర్మాతలు సంప్రదించారని మోనాల్ తెలిపింది. ఇందులో తనకు జంటగా, హీరో పాత్రలో అఖిల్‌ నటిస్తున్నాడని చెప్పగానే.. వేరే విషయాల గురించి తాను ఆలోచించలేదని... వెంటనే సంతకం చేసేశాని మోనల్‌ తెలిపింది.

More News

వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల పార్టీ ప్రారంభించినప్పటి నుంచి మంత్రి గంగుల కమలాకర్ ఆమెపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఆమెను ఏదో ఒక విధంగా..

ఐదో రోజు ‘ఉప్పెన’ ఎంత కలెక్ట్ చేసిందంటే..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఇంకా హవా కొనసాగిస్తూనే ఉంది. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం

ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3

సరికొత్త కథలను ఎంపిక చేసుకోవడం, కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకు రావడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఆచార్య క్రియేషన్స్ ప్రత్యేక గౌరవం, మంచి పేరు తెచ్చుకుంది.

‘రాధేశ్యామ్’ ఆసక్తికర ఫోటో విడుదల

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం స్టార్ట్.. ‘బాహుబలి’ రికార్డ్ బ్రేక్!

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ క్రియేట్ అయింది. దీంతో ఆయన సినిమా వస్తోందంటేనే షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిదీ ఆసక్తికరమే. ప్రస్తుతం రాజమౌళి