మ‌రిన్ని మంచి పాత్ర‌ల‌తో అల‌రిస్తా - స‌మంత‌

  • IndiaGlitz, [Saturday,November 18 2017]

'ఏం మాయ చేసావే' సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ సమంత. గ్లామర్ రోల్స్ తో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా పెర్ఫార్మన్స్ బేస్డ్ రోల్స్ కూడా చేస్తోంది సామ్. ఇలా చేసిన‌ 'ఎటో వెళ్లి పోయింది మనసు', 'మనం', 'రాజు గారి గది 2' లాంటి సినిమాలు న‌టిగా తనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఒక తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం లో కూడా తన కంటూ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది ఈ చెన్నై చిన్న‌ది. తాజాగా నాగ చైతన్యని పెళ్లాడిన స‌మంత‌.. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకుంటుందని మీడియాలో ఆ మ‌ధ్య‌ వార్తలు వినిపించాయి.

అయితే ఈ మధ్య ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటిలో సినిమాలకు గుడ్ బై చెప్పడం గాని, గ్యాప్ తీసుకునే ఆలోచన గాని లేదని కుండ బద్దలు కొట్టింది. ఇంతవరకు తనకి నచ్చిన, తన కోసమే డిజైన్ చేసిన మంచి రోల్స్ వ‌చ్చాయ‌ని.. అది ఒక వరంగా భావించి భ‌విష్య‌త్‌లో కూడా మరిన్ని మంచి పాత్రలు చేయాలని వుందని, చేస్తానని ఆశా భావం వ్యక్తం చేసింది స‌మంత‌ .

More News

5 నెల‌ల మెగా సంద‌డి

మెగాఫాన్స్ కి 2017 మిక్స్‌డ్ ఇయ‌ర్‌గానే చెప్పొచ్చు. ఈ సంవ‌త్స‌రం మెగా క‌థానాయ‌కులు న‌టించిన చిత్రాల్లో 'ఖైదీ నంబర్ 150', 'ఫిదా' మూవీస్ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోగలిగాయి.

విల‌న్ కావాల‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను - చ‌ర‌ణ్‌దీప్‌

'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం' సినిమా గురించి విన‌ప‌డుతున్న వార్త‌లు. సినీ ప్రేక్ష‌కులే కాదు. సినీ ప్ర‌ముఖులు, స్టార్ హీరోలు..ఇలా సినిమా చూసిన వారంద‌రూ సినిమా అద్భుతంగా ఉంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు.

'రంగ‌స్థ‌లం'లో ఆ పాత్ర చాలా స్పెష‌ల్

ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి. తెలుగుతో పాటు త‌మిళంలోనూ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌.. గ‌తేడాది వ‌చ్చిన స‌రైనోడు చిత్రంతో ప్ర‌తినాయ‌కుడుగా ట‌ర్న్ అయ్యాడు.

మణిరత్నం.. ఫ్యామిలీ మూవీ

ప్రాంతీయ చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం. తమిళంలో ఆయన రూపొందించిన పలు చిత్రాలు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి.

వ్యాపార భాగస్వామిపై నాగసుశీల పిర్యాదు

అక్కినేని నాగేశ్వరరావు తనయ, నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామి అయిన చింతలపూడి శ్రీనివాస్పై ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే..దాదాపు పన్నెండేళ్లుగా వ్యాపారం భాగస్వామ్యులుగా ఉన్నారు.