నేను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ను: ర‌జినీకాంత్‌

త‌మిళ‌నాడుకి చెందిన సంఘ సంస్క‌ర్త రామ‌స్వామి పెరియార్‌పై త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడంటూ.. ర‌జినీ ఇంటి ముందు పెరియార్ ద్ర‌విడ క‌ళ‌గ‌మ్ నిర‌స‌న‌లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై మీడియాతో ర‌జినీకాంత్ మాట్లాడుతూ తాను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌న‌ని అన్నారు. ''1971లో ఏం జ‌రిగిందనే విష‌యాన్ని నేను చెప్పాన‌ని కొంద‌రు నేను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అంటున్నారు. అప్పుడు ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను గురించి ఓ మ్యాగ‌జైన్‌లో ప్ర‌చురిస్తే వాటిని ఆధారంగా చేసుకునే నేను మాట్లాడాను. నేనేదీ సొంతంగా ఊహించి మాట్లాడ‌లేదు. వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా నా ద‌గ్గ‌ర ఉన్నాయి. దీనికి నేను క్ష‌మాప‌ణ‌లు చెప్పను'' అన్నారు.

1971లో పెరియార్ నిర్వ‌హించిన ఓ ర్యాలీలో సీతారాముల విగ్ర‌హాల‌ను అభ్యంత‌రక‌రంగా ఊరేగించార‌ని ర‌జినీ తప్పుడు ఆరోప‌ణ‌లు చేశారంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై పెరియార్ ద్ర‌విడ క‌ళైగ‌మ్ అధ్య‌క్షుడు మ‌ణి ర‌జినీకాంత్‌పై పోలీస్ స్టేష‌న్‌లోనూ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ప్ర‌జ‌ల‌కు వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా అన్నారు. అయితే ర‌జినీకాంత్ వ్యాఖ్య‌ల్లో త‌ప్పులేదంటూ త‌మిళ‌నాడు బీజేపీ పార్టీ ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా మాట్లాడింది.

More News

ప్ర‌భాస్ కొత్త చిత్రంలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్‌!!

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్

మూడో స్థానం కోసం బ‌న్నీ ప‌రుగు...చేరుకుంటాడా?

వ‌రుస సినిమాలు చేస్తూ ఓ కూల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయాల‌నుకున్న బ‌న్నీ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు.

ప‌క్కా మాస్ టైటిల్‌తో వెంక‌టేశ్ `అసుర‌న్‌`

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

`RRR` టీమ్‌తో జ‌త క‌ట్టిన బాలీవుడ్ స్టార్‌

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం

ఇక రెండు నెల‌లు మ‌హేశ్ క‌న‌ప‌డ‌డు...!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ సంక్రాంతికి `స‌రిలేరునీకెవ్వ‌రు`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పెద్ద స‌క్సెస్‌ను సొంతం చేసుక‌న్న సంగ‌తి తెలిసిందే.