మాటలకందని విషాదం.. ఆ తల్లిదండ్రులకు బిడ్డగా నిలుస్తా: పవన్

  • IndiaGlitz, [Wednesday,September 02 2020]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడకకు సన్నాహాలు చేస్తూ ముగ్గురు జన సైనికులు మృతి చెందారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవన్ కటౌట్ కడుతుండగా.. విద్యుత్ షాక్‌కు గురై సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అనే ముగ్గురు జనసైనికులు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త తనను ఎంతగానో కలచి వేసిందని.. ఇది మాటలకందని విషాదమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ తగలడంతో వారు చనిపోయారనే వార్త నా మనసుని కలచివేసింది. ఇది మాటలకు అందని విషాదం. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను.

ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మరో ముగ్గురు జన సైనికులు శ్రీ హరికృష్ణ, శ్రీ పవన్, శ్రీ సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు తెలిపాను. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించాను’’
అని పవన్ పేర్కొన్నారు.

More News

నన్ను చూడటానికి ఎవరొస్తారులే అనుకున్నా: పవన్

తన గురించి తానెప్పుడూ ఆలోచించని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా

అలా నేను, మా ఇంట్లో వాళ్లం నా బర్త్‌డేని మరచిపోయేవారం: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకొని జనసైనికులు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం!

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్ర‌భాస్ బాట‌లో మ‌హేశ్ కూడా...!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’.

టార్గెట్ ఫిక్స్ చేసిన ప‌వ‌న్‌!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.