Allu Arha : డబ్బింగ్ చెబుతోన్న అల్లు అర్హ.. మురిసిపోతున్న బన్నీ, ఫోటో వైరల్

  • IndiaGlitz, [Thursday,January 19 2023]

మెగాస్టార్ చిరంజీవి వేసిన విత్తనం నుంచి ఒక మహా వృక్షంలా మారింది మెగా ఫ్యామిలీ. ఆయన అడుగుజాడల్లో నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సాయిథరమ్ తేజ్, కల్యాణ్ దేవ్ వంటి వారు హీరోలుగా నిలబడ్డారు. ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకుల్లో సగ భాగం మెగా ఫ్యామిలీ నుంచే వున్నారు. తాజాగా ఆ కుటుంబం నుంచి తర్వాతి తరం కూడా స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనుంది.

తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటోన్న అల్లు అర్హ:

అల్లు అర్జున్ - స్నేహ దంపతుల పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌కు కూడా సోషల్‌ మీడియాలో బోలెడు క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెడుతున్న అల్లు అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాల్లో చిన్నారి అర్హ.. భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన శాకుంతలం ట్రైలర్‌లో సింహంపై స్వారీ చేస్తున్న భరతుడిగా అర్హ కనిపించి ఆకట్టుకుని తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. అంతేకాదు.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు. చిన్న వయసులోనే ఎంతో ప్రతిభ చూపుతోందని కామెంట్ చేస్తున్నారు.

ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు శాకుంతలం:

ఇదిలావుండగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ శాకుంతలం సినిమాను నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి, మధుబాల, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న శాకుంతలంను రిలీజ్ చేయనున్నారు.

More News

Vijay Antony : షూటింగ్‌లో ప్రమాదం.. విజయ్ ఆంటోనీ ఆరోగ్యంపై వదంతులు, భయాందోళనల్లో ఫ్యాన్స్

సాధారణ సౌండ్ ఇంజనీర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోనీ ..

Popcorn:‘పాప్ కార్న్’ మూవీ నుంచి ‘మది విహంగమయ్యే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన నాగ చైతన్య

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో

Mukarram Jah : ముకరం జా మరణం.. ముగిసిన నిజాంల ఘన వారసత్వం

హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం ముకరం జా కన్నుమూయడంతో అసఫ్ జాహీ రాజ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Raghunandan Rao:4 వేల కోట్ల ల్యాండ్ స్కాంలో తోట చంద్రశేఖర్.. భూ దందా కోసమే బీఆర్ఎస్‌లోకి : రఘునందన్ రావు వ్యాఖ్యలు

ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన జనసేన నేత తోట చంద్రశేఖర్‌ను ఉద్దేశించి బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Amala Paul:గుడిలోకి అడుగుపెట్టనివ్వని పూజారులు.. అమలాపాల్‌కు ఘోర అవమానం, వివక్ష పోలేదంటూ హీరోయిన్ ఆవేదన

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నా.. ఇంకా దేశంలో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి.