`ఇద్ద‌రి లోకం ఒక‌టే` డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌

  • IndiaGlitz, [Tuesday,December 03 2019]

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఇద్ద‌రి లోకం ఒక‌టే'. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం 'ఇద్ద‌రి లోకం ఒక‌టే'. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందింది. డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌లు, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తున్నాం'' అన్నారు.

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, షాలిని పాండే, నాజ‌ర్‌, పృథ్వీ, రోహిణి, భ‌ర‌త్‌, సిజ్జు, అంబ‌రీష్‌, క‌ల్ప ల‌త త‌దిత‌రులు

More News

'నిశ్శ‌బ్దం' కోసం ఆ రెండు విష‌యాల‌ను నేర్చుకున్న అనుష్క‌

టాలీవుడ్ జేజెమ్మ అనుష్క శెట్టి దాదాపు రెండేళ్ల త‌ర్వాత `నిశ్శ‌బ్దం` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

వివాద‌స్ప‌ద‌మైన పాత్ర‌లో ప్రియమణి

ప‌రుత్తి వీర‌న్‌తోనే జాతీయ అవార్డుని ద‌క్కించుకున్న హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఆ గుర్తింపుతో తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

నిఖిల్ హీరోగా... ప్రతాప్ దర్శకత్వంలో నూతన చిత్రం

నిర్మాత బన్నీ వాసుకు, డైరెక్టర్ సుకుమార్ కు మధ్య ప్రొఫెషనల్ గా. పర్సనల్ గా ఎంత మంచి అనుబంధం ఉందో తెలిసిందే.

'జోహార్' చిత్ర మాస్టరింగ్ పనులు మొదలు!

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ‘జోహార్’ నిర్మాణానంతర కార్యక్రమాలలో

డిసెంబర్ 4న 'ప్రతిరోజు పండగే' ట్రైలర్  విడుదల

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా,  మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో