Chandrababu:జగన్‌ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలు: చంద్రబాబు

  • IndiaGlitz, [Saturday,April 20 2024]

తల్లిని, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్రాన్ని చూస్తారా? అని సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. ఇప్పటికే 30 ఏళ్లు రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయిందని.. మరోసారి అలాంటి తప్పు చేయవద్దు అని ప్రజలకు పిలుపునిచ్చారు. సర్వేపల్లిలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు ఇక ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలని రాష్ట్రం నిలబడాలని కోరారు.

రాష్ట్రంలో క్లాస్ వార్ కాదని, క్యాష్ వార్ నడుస్తుందని చంద్రబాబు తెలిపారు.రాష్ట్రంలో ఉన్న డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌లోకే వెళుతుందని ఆరోపింఆచరు. అభివృద్ధి అనేది జగన్ పాలనలో అస్సలు కనిపించిందా? అంటూ ప్రశ్నించారు. ఎండల బాదుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాదుడే ఎక్కువగా ఉందని ఈ సభను చూస్తే అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రికి ఒళ్లంతా అహంకారమని.. ఎక్కడికక్కడ దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియదని మండిపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు.

కోర్టుల్లో ఫైళ్లను కాజేసిన వ్యక్తి కాకాణి గోవర్థన్ రెడ్డి అని ఈసారి అతనిని ఓడించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలని.. కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ ఫీల్డ్స్ అని విమర్శించారు. ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూరుకుపోయాడంటే... మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదు... శాశ్వతంగా గోతిలోనే ఉంటాడని హెచ్చరించారు. మంత్రి దోచిన ఈ సహజవనరులే నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నాయి... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని చంద్రబాబు హెచ్చరించారు.

ఇక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.15వేలు అందిస్తామన్నారు. ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు కలిశాయని వివరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రం కోసమే చేతులు కలిపారని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.

More News

Harish Shankar:చోటా కె నాయుడికి దర్శకుడు హరీష్‌ శంకర్ వార్నింగ్

దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar), కెమెరామెన్ చోటా కె నాయుడు మధ్య కొన్నాళ్లుగా ఉన్న విభేదాలు తాజాగా రచ్చకెక్కాయి.

ఏపీలో విజయం వైసీపీదే.. టీడీపీ అంతర్గత సమావేశం వీడియో లీక్..

ఏపీలో ఎక్కడా చూసిన వైసీపీ ప్రభంజనమే కనిపిస్తోంది. సీఎం జగన్ సభలకు జనం తాండోపతండాలుగా పోటెత్తుతున్నారు. ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలతో పాటు

Pemmasani:పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నిర్వీర్యం చేశారు: పెమ్మసాని

పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నిర్వీర్యం చేశారని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.

Modi:చంద్రబాబుకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Bhaje Vayu Vegam:కార్తికేయ 'భజే వాయు వేగం’ టీజర్ విడుదల చేసిన మెగాస్టార్

టాలీవుడ్ యువహీరో కార్తికేయ తాజాగా నటిస్తు్న్న చిత్రం 'భజే వాయు వేగం’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం