ఎస్.పి.బి కి ఇళయరాజా నోటీసులు

  • IndiaGlitz, [Monday,March 20 2017]

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, ఇళ‌య‌రాజా అంటే ఒక‌ప్పుడు హిట్ కాంబినేష‌న్‌. మ్యూజిక్‌లో వీళ్ళ కాంబోలో సూప‌ర్‌హిట్ పాట‌లు వ‌చ్చాయి. ఇద్ద‌రు మంచి మిత్రులు కూడా. అయితే ఈ మిత్రుల మ‌ధ్య కూడా ఓ స‌మ‌స్య వ‌చ్చి ఇళ‌య‌రాజా బాలుకు కోర్టు నోటీసులు పంపాడు. అస‌లు విష‌యంలోకి వెళితే సింగ‌ర్‌గా యాబై ఏళ్ళు పూర్తి చేసుకున్న బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఎస్‌.పి.బి 50 పేరుతో వ‌ర‌ల్డ్ టూర్ నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా ర‌ష్యా, మ‌లేషియా, శ్రీలంక‌, దుబాయ్ త‌దిత‌ర ప్రాంతాల్లో పాట‌ల కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

అయితే అమెరికాలో ఈ ప్రోగ్రాం చేయ‌డానికి ముందు బాల‌సుబ్ర‌మ‌ణ్యంకు ఇళ‌య‌రాజా కోర్టు నోటీసులు పంపాడు. త‌న అనుమంతి లేకుండా పాటలు పాడ‌కూడ‌దంటూ, అలా చేస్తే భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వ‌స్తుంద‌ని చెప్పాడు. దీనిపై ఫేస్ బుక్‌లో ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం స్పందించారు. తాను అమెరికాలో ఇళ‌య‌రాజా సంగీతంలో వ‌చ్చిన పాట‌ల‌ను పాడ‌న‌ని, మిగ‌తా సంగీత ద‌ర్శ‌కుల కంపోజిష‌న్‌లో వ‌చ్చిన పాట‌ల‌ను పాడుతాన‌ని, క‌చేరీ అనుకున్న ప్ర‌కార‌మే జ‌రుగుతుంద‌ని త‌న అభిప్రాయాన్ని తెలిపారు.

More News

ఉగాది కానుకగా 'కారులో షికారుకెళితే'

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 31న 'కారులో షికారు కెళితే' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

'మెట్రో' సినిమా సక్సెస్ మీట్

ఆర్ 4ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`,`జర్నీ`,`పిజ్జా`వంటి బ్లాక్బస్టర్ల ను అందించిన సురేష్ కొండేటి సమర్పణ లో రజనీ తాళ్లూరి నిర్మించిన 'మెట్రో' చిత్రం

'ఆచారి అమెరికా యాత్ర' మొదలైంది!

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం'ఆచారి అమెరికా యాత్ర'.'దేనికైనా రెడీ,'ఈడోరకం ఆడోరకం'

కమల్ హాసన్ అన్న కన్నుమూత...

యూనివర్సల్ స్టార్ కమల్హాసన్ ఇప్పుడు శభాష్ నాయుడు సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.

'బాహుబలి2' ఆడియో రిలీజ్ డేట్

రాజమౌళి,ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న విజువల్ వండర్ 'బాహుబలి 2'.