బాలు.. త్వరగా లేచిరా!  నీ కోసం కాచుకుని కూర్చున్నాను:  ఇళ‌య‌రాజా

  • IndiaGlitz, [Saturday,August 15 2020]

గానగంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోవిడ్ 19 కార‌ణంగా ఆగ‌స్ట్ 5న చెన్నై ఎంజీఎం హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈరోజు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉందంటూ హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలియ‌జేయ‌డంతో ఆయ‌న అభిమానులు, సినీ ప్ర‌ముఖులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు కంగారు ప‌డ్డారు. అయితే ఆయ‌న ఆరోగ్యంగా ఉన్నార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు మంచి స్నేహితుడైన మ్యాస్ట్రో ఇళ‌యరాజా, బాలు త్వ‌ర‌గా కోలుకోవాలని కోరుకుంటూ వీడియో విడుద‌ల చేశారు.

‘‘బాలు.. త్వ‌ర‌గా లేచిరా! నీకోసం కాచుకుని కూర్చున్నాను. మ‌న ప్ర‌యాణం సినిమా ప్రారంభం కాలేదు. అలాగే సినిమాతో ముగిసిపోయేది కాదు. సంగీతం మ‌న జీవితానికి ఓ ఆధారంగానే నిలిచింది. స్టేజీ క‌చేరీల‌పై ప్రారంభ‌మైన మ‌న స్నేహం, సంగీతం ఒక‌దాన్ని ఒక‌టి విడిచి ఎలా ఉండ‌లేదో, అలాగే మ‌న స్నేహం ఎప్పుడూ విడిపోలేదు. మ‌న మ‌ధ్య గొడ‌వ ఉన్నా, లేకున్నా అది స్నేహ‌మే. ఈ విష‌యం మ‌న ఇద్ద‌రికీ బాగా తెలుసు. నువ్వు క‌చ్చితంగా తిరిగి వ‌స్తావ‌ని నా మ‌న‌సు చెబుతుంది. అది నిజంగా జ‌ర‌గాల‌ని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను.. బాలు.. త్వ‌ర‌గా రా!!’’ అని తెలిపారు ఇళయరాజా.

More News

ఏపీలో కొత్తగా 8943 కరోనా కేసులు..

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీకి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్‌..!!

ఒక వైపు ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాణంలో చురుకుగా ఉండే వ్య‌క్తుల్లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఒక‌రు. య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు,

ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే...

ప్రవేశ పరీక్షలపై ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 5న ఆయనకు కరోనా సోకింది.

ప‌వ‌న్ 29 ఖ‌రారైందా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో ఉంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ముందుగా పింక్ రీమేక్ వ‌కీల్‌సాబ్ రీమేక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.