close
Choose your channels

నిజాముద్దీన్ ఘటనతో 'నమాజ్‌'లపై కీలక ప్రకటన!

Thursday, April 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిజాముద్దీన్ ఘటనతో ‘నమాజ్‌’లపై కీలక ప్రకటన!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు కాస్త కోలుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో బాంబులాంటి షాకింగ్ విషయాన్ని వినాల్సి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నిజాముద్దీన్ ఘటన జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలో ముస్లిం మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రేపు నమాజ్‌లు వద్దు

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహ్మదీయులు మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే నమాజ్‌లు చేసుకోవాలని దారుల్ ఉలుమ్ దేవ్‌బంద్ ఫత్వా జారీ చేయడం జరిగింది. గురువారం రాత్రి దారుల్ ఉలుమ్ దేవ్‌బంద్ ఉలేమా కోరీ ఇస్‌హాక్ పేరుతో ఈ ఫత్వా జారీ అయింది. అంతేకాదు.. ఐదుగురికి మించి మసీదులో ప్రార్ధనలకు వెళ్లరాదని ఒకింత హెచ్చరించింది కూడా. కాగా.. రేపు శుక్రవారం కావడంతో ముస్లింలు పెద్ద ఎత్తున మసీదులకు నమాజ్‌కు వెళ్తుంటారు. ఇప్పటికే జనసమూహం అన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించట్లేదు. ఇదిలా ఉంటే.. స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సూచించారు. మరోవైపు.. కరోనా లక్షణాలుంటే ఏ మాత్రం అలక్ష్యం.. దాచిపెచిపెట్టడం లాంటి చేయొద్దని ఫత్వాలో నిశితంగా పేర్కొన్నారు. నిజాముద్దీన్ ఘటన ఎఫెక్ట్‌తో ఇలా ఫత్వా జారీ చేయడం జరిగింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.