పాత‌బ‌స్తీ నేప‌థ్యంతో..

  • IndiaGlitz, [Thursday,January 25 2018]

పోలీస్ పాత్రలకి, మాస్ మహారాజా రవితేజకి విడదీయరాని బంధం ఉంది. పోలీస్ కథలతో గతంలో ర‌వితేజ హీరోగా వచ్చిన 'వెంకీ', 'విక్రమార్కుడు', 'మిరపకాయ్', 'పవర్' వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు అదే కోవలోకి మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని చేర్చేందుకు.. మరో పోలీస్ కథతో సిద్ధపడిపోయారు ఈ మాస్ మహారాజా.ఆ చిత్ర‌మే 'టచ్ చేసి చూడు'.

ఈ సినిమా ద్వారా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. పాత బస్తీలో కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే విధంగా రవితేజ చేసిన పోలీస్ పాత్ర ఉంటుందని సమాచారం. ఆ క్రమంలో సాగే ప్రతీ సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలుస్తోంది. రవితేజ సరసన రాశి ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.