శ్రీను వైట్ల చిత్రంలో..

  • IndiaGlitz, [Saturday,December 23 2017]

హాస్య న‌టుడిగా కెరీర్‌ని ప్రారంభించి.. క్ర‌మంగా కథానాయ‌కుడి పాత్ర‌లవైపు అడుగులు వేశారు సునీల్‌. అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, పూల‌రంగ‌డు, త‌డాఖా చిత్రాల‌తో కథానాయ‌కుడిగా మంచి విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్న సునీల్‌కి ఆ త‌రువాత మాత్రం ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం 2 కంట్రీస్ విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. ఈ నెల 29న ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. కాగా, ఇటీవ‌ల హాస్య పాత్ర‌ల్లోనూ న‌టించ‌డానికి సిద్ధ‌మేనంటూ సునీల్ స్టేట్మెంట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్.. ఎన్టీఆర్ హీరోగా రూపొందించే చిత్రంలో హాస్య ప్ర‌ధాన పాత్ర‌లో సునీల్ సంద‌డి చేయ‌నున్నాడు. దీంతో పాటు.. మ‌రో చిత్రంలోనూ సునీల్ న‌టించే అవ‌కాశ‌ముంది. ఇంత‌కీ ఆ సినిమా ఏమిటంటే.. శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టించ‌బోయే చిత్రం. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నుంది. శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సొంతం చిత్రంతో పాటు అంద‌రివాడు, రెడీ చిత్రాల్లోనూ సునీల్ చేసిన కామెడీకి మంచి పేరు వ‌చ్చింది. మ‌రి కొత్త చిత్రంతోనూ ఆయ‌న అల‌రిస్తారేమో చూడాలి.