close
Choose your channels

'టెంప‌ర్' రీమేక్ లో..?

Thursday, November 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన టెంప‌ర్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 2015లో విడుద‌లైన ఈ సినిమా.. ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. యువ క‌థానాయ‌కుడు ర‌ణ్ వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప‌లువురి పేర్లు వినిపించాయి.

అయితే తాజాగా వినిపిస్తున్న క‌థనాల ప్ర‌కారం.. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు జాన్వి క‌పూర్ ఎంపికైంద‌ని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ఇంకా రాలేదు. ప్ర‌స్తుతం జాన్వి ధ‌డ‌క్ అనే సినిమా చేస్తోంది. ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ చిత్రం మ‌రాఠీలో విజ‌యం సాధించిన సైరాట్‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. ఒక‌వేళ టెంప‌ర్ రీమేక్‌లోనూ జాన్వి హీరోయిన్‌గా ఎంపికైతే.. ఆమె తొలి రెండు చిత్రాలు కూడా రీమేక్‌లు అయిన‌ట్టే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.