close
Choose your channels

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... నేడు ఎన్నంటే..

Tuesday, August 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు పెరిగాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1896 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 82,647కు చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 645 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 22,628 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా నుంచి కోలుకుని 59,374 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 338, రంగారెడ్డి 147, కరీంనగర్‌ 121, మేడ్చల్‌ 119, వరంగల్‌ అర్బన్‌ 95, గద్వాల్‌ 85, జనగామ 71, కామారెడ్డి 71, పెద్దపల్లి 66 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 6,42,875 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.