close
Choose your channels

'ఇండియ‌న్ 2' ప‌నుల్లో స్పీడు పెంచ‌మ‌న్న క‌మ‌ల్

Sunday, September 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియ‌న్ 2 ప‌నుల్లో స్పీడు పెంచ‌మ‌న్న క‌మ‌ల్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`. 1996లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `ఇండియ‌న్‌`కు ఇది సీక్వెల్. ఈ సీక్వెల్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ధార్థ్‌, ర‌కుల్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అలాగే చెన్నై టీన‌గ‌ర్‌లోని ఓ భారీ హోట‌ల్‌కి క‌మ‌ల్ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ప్ర‌త్యేక‌మైన సెట్‌లో క‌మ‌ల్‌హాస‌న్‌కు, విల‌న్‌కు మ‌ధ్య ఫైట్‌ను చిత్రీక‌రించారు.

ఈ సినిమా ప‌నులు నెమ్మ‌దిగా సాగుతున్నాయ‌ని వార్త‌లు రావ‌డం.. త‌దిత‌ర కార‌ణాల‌తో రీసెంట్‌గా క‌మ‌ల్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను క‌లిసి సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌మ‌ని కోరారట‌. దానికి వారు కూడా స‌రేన‌న్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం వ‌య‌సు మ‌ళ్లిన సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి తెర‌పై క‌న‌ప‌డ‌నున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న న‌టిస్తుంటే.. సిద్ధార్థ్ జోడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన మార్ష‌ల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంటుంది. సీక్వెల్‌లో ఈమెపై కూడా కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న క‌మ‌ల్ హాస‌న్ మ‌రో ప‌క్క బిగ్‌బాస్ 3 త‌మిళ వెర్ష‌న్‌కు హోస్ట్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.