భారతీయుడు 2: కాజల్ ప్లేస్‌లో తమన్నా.. రూమర్స్‌కి త్వరలోనే క్లారిటీ..!!

  • IndiaGlitz, [Monday,December 06 2021]

తమిళ దర్శక దిగ్గజం శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘‘ఇండియన్ 2’’ సినిమాపై పరిశ్రమలో అంచనాలు భారీగా వున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పాతికేళ్ల క్రితం విడుదల ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్ నటన, శంకర్ టేకింగ్, మర్మకళ, పాటలు ‘‘భారతీయుడి’’ని ఎక్కడో నిలబెట్టాయి. దీనికి సీక్వెల్ తీయాలని అప్పట్లోనే ప్లాన్ చేసినప్పటికీ కుదరలేదు. దీంతో దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత ‘‘భారతీయుడు 2’’ కార్యరూపం దాల్చింది.

కానీ సెట్స్‌పైకి వెళ్లిననాటి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక అవాంతరం వస్తూనే వుంది. తొలినాళ్లలోనే షూటింగ్‌లో క్రేన్ కూలి ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ తర్వాత కరోనా, లాక్‌డౌన్, లైకా ప్రొడక్షన్స్‌- దర్శకుడు శంకర్‌ మధ్య వివాదాలు, ఇప్పుడు కమల్ హాసన్‌కు కరోనా వంటి ఇబ్బందులతో ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా పరిస్ధితి తయారైంది. అన్ని కుదురుకుంటున్న దశలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ రూపంలో సమస్య వచ్చింది.

'ఇండియన్‌ 2' ప్రాజెక్ట్ నుంచి కాజల్‌ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్‌ ఇప్పుడు గర్భవతి అని, అందుకే సినిమా వదిలేసిందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి మేకర్స్ అన్వేషణలో పడ్డారట. తొలుత కాజల్‌ స్థానంలో త్రిషను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు మిల్క్‌ బ్యూటీ తమన్నా పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గానూ, వయసు మళ్లిన పాత్రలోనూ కనిపించాల్సి ఉంది. ఈ క్యారెక్టర్ తమన్నాకి కూడా నచ్చడంతో హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్‌. దీనికి సంబంధించి త‍్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

More News

'రామారావు ఆన్ డ్యూటీ' టైం ఫిక్స్ .. ఆర్డర్స్ రిలీజ్ చేసిన మేకర్స్..!!

క్రాక్ హిట్‌తో ట్రాక్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో దూకుడు మీదున్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ ఎలిమినేషన్‌.. మానస్‌ని హగ్ చేసుకొని వీడ్కోలు, హౌస్‌మేట్స్ ఎమోషనల్

బిగ్‌బాస్ 5 తెలుగులో ఆదివారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. అందరూ ఊహించినట్లుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావడంతో హౌస్ మేట్స్ షాకయ్యారు.

చాపకింద నీరులా ఒమిక్రాన్‌ .. మహారాష్ట్రలో ఒకేసారి 7 కేసులు, భారత్‌లో 12కి చేరిన సంఖ్య

అనుకున్నదంతా అయ్యింది. నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తోన్నదే జరుగుతోంది. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది.

అఖండ సినిమా ఆడుతున్న థియేటర్‌లో మంటలు.. పరుగులు తీసిన ప్రేక్షకులు

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

మరో జానపద గాయకురాలిని స్టార్‌ని చేసిన ‘‘భీమ్లా నాయక్’’ .. ఎవరీ కుమ్మరి దుర్గవ్వ..?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘‘భీమ్లా నాయక్’’.