'ఇండియ‌న్ 2' ఆగిపోలేదు...

  • IndiaGlitz, [Thursday,May 16 2019]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాష్ క‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో 2.0 త‌ర్వాత రూపొందుతోన్న సినిమా ఇది. అయితే ఇటీవ‌ల భారీ బడ్జెట్ విష‌యంలో నిర్మాణ సంస్థ శంక‌ర్‌కు ప‌రిమితులు విధించ‌డంతో శంక‌ర్ మ‌రో నిర్మాణ సంస్థ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

దీంతో సినిమా ఆగిపోయింద‌ని, నిర్మాత‌లు మారుతున్నారంటూ ప‌లు వార్త‌లు వినిపించాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్సే నిర్మించ‌డానికి నిర్ణ‌యించుకుంద‌ట‌. జూన్ నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ట‌. సినిమాను 2021 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

విల‌న్‌గా ఐశ్వ‌ర్యారాయ్‌

ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఐశ్వ‌ర్యారాయ్‌.. చాలా గ్యాప్ త‌ర్వాత ద‌క్షిణాదిన సినిమా చేయ‌నుంది.

సమంత, ఉప్సీకి అక్కినేని అమల ఛాలెంజ్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మనం 'రైస్ బకెట్ ఛాలెంజ్', 'ఫిట్ నెస్ ఛాలెంజ్', 'మొక్కల పెంపకం' ఇలా పలు ఛాలెంజ్‌లు చూశాం. అయితే ఇప్పుడు మరో ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.

డెఫినెట్‌గా 'ఎంతవారలైనా' పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను - నిర్మాత జి. సీతారెడ్డి 

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఎంతవారలైనా'.

టీవీ9 కేసులో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు.. ఢిల్లీలో ఏం జరగబోతోంది!?

టీవీ9 కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. గురువారం రవిప్రకాష్ వేసిన పిటీషన్‌కు అర్హత లేదంటూ అలందా మీడియా ఢిల్లీలోని నేషనల్‌ కంపెనీ..' కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల‌్'

మహేశ్‌ను.. ‘ఒరేయ్’ అనడానికి చాలా ఇబ్బంది పడ్డా...!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన తాజా చిత్రం ‘మహర్షి’.