close
Choose your channels

రాజ‌మండ్రిలో 'ఇండియ‌న్ 2'

Wednesday, September 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజ‌మండ్రిలో `ఇండియ‌న్ 2`

లంచ‌గొండి అధికారుల భ‌ర‌తం ప‌ట్టిన సేనాప‌తి వెండితెర‌పై సంద‌డి చేసి 23 ఏళ్లు అవుతుంది. `ఇండియ‌న్(భారతీయుడు)`గా 1996లో వెండితెర‌పై సేనాప‌తి చేసిన సంద‌డి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైర‌క్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా `ఇండియ‌న్ 2` రూపొందుతోంది.

కొన్ని రోజులుగా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఈ సినిమా కొంత మేర షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు శంక‌ర్‌, క‌మ‌ల్ హాస‌న్ అండ్ టీమ్ త‌దుప‌రి షెడ్యూల్‌ను రాజ‌మండ్రిలో ప్లాన్ చేశారు. రాజ‌మండ్రి జైలులో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి శంక‌ర్ ప్లాన్ చేశాడు. గురువారం నుండి ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా రూపొందుతుంది. క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్నారు.

`2.0` త‌ర్వాత శంక‌ర్, క‌మ‌ల్ హాస‌న్‌తో క‌లిసి `ఇండియ‌న్ 2`ను ప్రారంభించారు. కానీ.. క్ర‌మంగా బ‌డ్జెట్ విష‌యంలో శంక‌ర్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు మ‌ధ్య కాస్త బేదాభిప్రాయాలు రావ‌డంతో ప్రాజెక్ట్ ఓ ద‌శ‌లో ఆగిపోయింది. చివ‌ర‌కు ప‌లు ద‌ఫాల చ‌ర్చ‌లు త‌ర్వాత ఇండియ‌న్ 2 ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వ‌చ్చింది. అయితే శంక‌ర్‌కు లైకా బ‌డ్జెట్ ప‌రిమితులు విధించిన‌ట్లు స‌మాచారం. సినిమాను కూడా వీలైనంత త్వ‌ర‌గానే పూర్తి చేయ‌డానికి శంక‌ర్ ప్లాన్స్ చేస్తున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.