ఎఫ్‌ 2..అనీల్‌ రావిపూడికి ఇండియన్‌ పనోరమ అవార్డ్‌

2019 సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఎఫ్‌ 2..ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌'. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనీల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా పరంగా డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడికి అరుదైన గౌరవం దక్కింది. 2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్‌ 2’ సినిమాకుగానూ కేంద్ర అవార్డు ఇండియన్‌ పనోరమని అవార్డును అనీల్‌ రావిపూడి అందుకోనున్నారు. ఆ ఏడాదిలో ఇండియన్‌ పనోరమను దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం కూడా 'ఎఫ్‌2'నే కావడం విశేషం.

విక్టరీ వెంకటేష్‌, మిల్కీబ్యూటీ తమన్నా, వరుణ్‌తేజ్‌, మెహరీన్‌ నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమా రూపొందింది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామలీ ఫన్‌ రైడర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హట్‌ను సాధించింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు తెలిపింది. డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి మాట్లాడుతూ 2019 ఇండియన్‌ పనోరమ అవార్డుల్లో ఎఫ్‌ 2 సినిమా డైరెక్టర్‌గా అవార్డును అందుకోనుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్‌, నా సోదరుడు వరుణ్‌తేజ్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కు ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌కు రాజుగారికి, శిరీష్‌గారు నాపై నమ్మకంతో సినిమాను నిర్మించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

More News

సంక్రాంతి బరిలోకి రానా 'అరణ్య'

రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర పోషించిన అర‌ణ్య చిత్రం వచ్చే ఏడాది అంటే 2021 సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేయనుంది.

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ వేసిన నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య మళ్లీ అగ్గి రాజుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

నీలా కాదు.. టైమ్ అంటే టైమే: చెర్రీ.. 5 నెలలు లేటు: తారక్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా నుంచి హీరో రామ్

ప్రభాస్ సర్‌ప్రైజ్ వచ్చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. రేపు ప్రభాస్ సర్‌ప్రైజ్ రాబోతోందని షూటింట్ స్పాట్ నుంచి నిన్న పూజా హెగ్డే ఓ వీడియోను విడుదల చేసిన

ట్రెండింగ్‌లో ప్రభాస్ సీడీపీ.. సర్‌ప్రైజ్ అంటున్న పూజా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో రాబోతోంది. దీని కోసం ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సిద్ధమయ్యారు. క్యాజువల్‌గా అయితే కేక్ కటింగ్‌లు, రక్తదానాలు