విమానంలో కమెడియన్‌ వెకిలి చేష్టలు.. షాకిచ్చిన ఇండిగో!

  • IndiaGlitz, [Wednesday,January 29 2020]

బస్సు, ట్రైన్ లేదా విమాన ప్రయాణం ఇలా ఏదైనా సరే తోటి ప్రయాణికులతో మంచిగా ఉండకపోయినా పర్లేదు కానీ.. వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. అయితే కొందరు అదే పనిగా పెట్టుకుని తోటి ప్రయాణికులతో కామెడీ చేస్తూ.. చిత్రవిచిత్రాలుగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఒక్కోసారి సీన్ రివర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఇప్పుడు మీరు చదవబోయే వార్తే.. చక్కటి ఉదాహరణ. ఇంతకీ ఏం జరిగింది..? అనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది!
ఇండిగో విమానంలో (6E 5317) ముంబై నుంచి లక్నోకు మంగళవారం నాడు రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ అర్ణబ్‌ గోస్వామి, స్టాండప్‌ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కునాల్‌ కమ్రా ప్రయాణిస్తున్నారు. మహా గంట సేపు ఓపికపడితే ఎవరి దారిన వాళ్లు వెళ్తారు. కానీ.. ఆ గంట కూడా ఓపిక లేదేమో ఈ కమెడియన్‌కు.. తోటి ప్రయాణికుడైన అర్ణబ్‌ను ఇబ్బంది పెట్టాడు. అంతటితో ఆగని ఆయన.. ‘నువ్వు పిరికివాడివా? జర్నలిస్టువా? జాతీయవాదివా? జనానికి తెలియాలి’ అని రెచ్చగొడుతూ వెకిలిగా మాట్లాడాడు.

అర్ణబ్ ఏం చేశారు!
అయితే ఇంతలా రెచ్చగొడుతున్నా వీడెవడ్రా బాబూ.. పిచ్చోడిలా ఉన్నాడే అనుకున్నాడేమో కానీ అర్ణబ్ మాత్రం కమ్రా ప్రశ్నలకు స్పందించలేదు. ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని ల్యాప్‌టాప్‌ చూసుకుంటూ ఉండిపోయారే తప్ప ఆయన మాత్రం అస్సలు రియాక్ట్ కాలేదు. విమానంలో జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై ఇండిగో స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యింది.

మూల్యం చెల్లించుకున్న కమ్రా!
విమానంలో ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడినందుకు గాను కునాల్‌ తీరును అమర్యాదకరంగా భావించిన ఇండిగో ఆయన్ను తమ విమానాల్లో 6 నెలలు ప్రయాణించకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

విమానయాన మంత్రి స్పందన!
ఈ వ్యవహారంపై కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. విమానం లోపల అవాంతరాలను రేకెత్తించడం మర్యాద కాదని.. ఇది ఇతర ప్రయాణికుల భద్రతకు హాని కలిగిస్తుందన్నారు. హాస్యనటుడిపై ఇలాంటి నిషేధం విధించాలని ఇతర విమానయాన సంస్థలకు మంత్రి హర్దీప్ సూచించారు.

More News

ప్రారంభమైన ప‌వ‌న్ కళ్యాణ్ మరో కొత్త చిత్రం

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీసెంట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ చిత్రం `పింక్‌` సినిమా తెలుగు రీమేక్‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు.

మోదీ తర్వాత రజనీకాంతే

ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంతే... అవునా ఏ విషయంలో అనే సందేహం కలుగుతోంది కదూ..

'క్రాక్' కాపీ క‌థ‌నా?

ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `క్రాక్‌`. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి!

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం.

20 నిమిషాల కోసం దాదాపూ రూ.8 కోట్లా?

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ గ‌త ఏడాది ద‌బాంగ్ 3 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ సినిమాను ప్ర‌భుదేవా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మూడోసారి ప్ర‌భుదేవాద‌ర్శ‌క‌త్వంలోనే స‌ల్మాన్‌ఖాన్ రాధే