ఇంద్రగంటి మల్టీస్టారర్ లో అంతా తెలుగువారే!

  • IndiaGlitz, [Sunday,February 19 2017]

దర్శకుడిగా "గ్రహణం"తో కెరీర్ ను ప్రారంభించినప్పట్నుంచి ఇంద్రగంటి తన సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు నటీనటులు మరియు టెక్నీషియన్లు ఉండేలా చూసుకొనేవారు. తెలుగువారంటే ఆయనకి ముందు నుంచీ ప్రత్యేకమైన అభిమానం. ఆయన తెరకెక్కించిన "మాయా బజార్, ఆష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకుముందు ఆ తర్వాత, బందిపోటు, జెంటిల్ మెన్" చిత్రాల్లో మాగ్జిమమ్ తెలుగు ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకొనేవారు. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కోసం అందరూ తెలుగు వారే ఉండేలా ప్లాన్ చేసుకొన్నారు.
అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రంలో మన తెలుగమ్మాయిలైన ఈష మరియు అదితి మ్యానికల్ లను కథానాయికలుగా ఎంపిక చేసుకొన్న ఇంద్రగంటి మోహనకృష్ణ టెక్నీషియన్లు కూడా అందరూ తెలుగు వారినే తీసుకొన్నారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకొన్న విషయం తెలిసిందే. రేపటితో పూర్తికానున్న ఈ మొదటి షెడ్యూల్ లో హీరోహీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వెన్నెల కిషోర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.నరసింహారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

More News

ప్రశాంతి నిలయంలో షూటింగ్ జరుపుకొంటున్న 'శ్రీ సత్య సాయి బాబా'

సౌభాగ్య చిత్ర ,ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం -'శ్రీ సత్యసాయి బాబా '.'అమ్మోరు ','అరుంధతి','దేవుళ్లు'

సంగీతంపై మక్కువ చూపుతున్న స్టార్ కూతురు...

సాధారణంగా సినీ స్టార్స్ వారసులంతా సినిమా రంగంలోనే రాణించాలనుకుంటూ ఉంటారు.

డోర రహస్యం

దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు,ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది నయనతార.

మార్చిలో అఖిల్ చిత్రం....

అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం అఖిల్ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో

20 కోట్ల ఫైట్....

సూపర్ స్టార్ రజనీకాంత్,అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ ప్రధాన తారాగణంగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా '2.0'.