అఖిల్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

అక్కినేని అఖిల్ త‌న‌ రెండో సినిమాను మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు నాగార్జున ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే...అఖిల్ తొలి చిత్రం విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో అఖిల్ రెండో సినిమా ఎప్పుడు చేస్తాడా..? ఎప్పుడు స‌క్సెస్ సాధిస్తాడా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే...ఈ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఏమిటంటే....డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక అఖిల్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం జెంటిల్ మ‌న్ ఫేమ్ నివేథా థామ‌స్ ను ప‌రిశీలిస్తున్నారు. ఈమెతో పాటు కొత్త హీరోయిన్ అయితే ఎలా ఉంటుంద‌ని కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది. ఇక మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే...విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన ఇష్క్, మ‌నం చిత్రాల‌కు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.24 మూవీకి ఎ.ఆర్.రెహ‌మాన్ మ్యూజిక్ అందించారు. ఇప్పుడు అఖిల్ మూవీకి కూడా ఎ.ఆర్.రెహ‌మాన్ నే సెలెక్ట్ చేసార‌ని టాక్. డిఓపి - పి.ఎస్.వినోద్, డైలాగ్స్ రైట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌న్ ఫ‌ర్మ్ చేసిన‌ట్టు స‌మాచారం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో ఎనౌన్స్ చేయ‌నున్నారు.

More News

క్లారిటి ఇచ్చేసిన‌ శృతిహాస‌న్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు. ఇటీవ‌ల ప్రారంభం అయిన ఈ చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

రానా న్యూమూవీ టైటిల్ ఇదే..!

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ఘాజీ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత రానా - తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది.

'కోటికొక్కడు' ఆడియో విడుదల

సి.ఎల్.ఎన్.మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్శెట్టి అందిస్తున్న చిత్రం 'కోటికొక్కడు'. తమిళం, కన్నడంలో విడుదలైన ఈ చిత్రం కోట్లకు పైగా భారీ వసూళ్లను సంపాదించింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న చిలుకూరి బాలాజీ

అల్లాణి శ్రీధర్ స్వీయదర్శకత్వంలో ఈటివి సౌజన్యంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన చిలుకూరి బాలీజీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ కారు సినిమాకు యు సర్టిఫికెట్ ఇచ్చారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తి

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్టైగర్'వంటి సూపర్హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేషన్లో నవీన్చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తయింది.