రెజీనా, నివేద రీమేక్ మూవీ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో!

సురేష్ బాబు అధినేతగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం ఎక్కువగా రీమేక్ చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు ఉంది. కొరియన్ చిత్రాలపై ఇంకాస్త ఎక్కువగానే ద్రుష్టి పెట్టారు. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ ఓ బేబీ లో సమంత నటించగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇటీవల విడుదలైన వెంకీ నారప్ప మూవీ తమిళ సూపర్ హిట్ అసురన్ చిత్రానికి రీమేక్.

ఇదీ చదవండి: నిద్రలోనే తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి జయంతి!

తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొరియన్ సూపర్ హిట్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్'కి ఇది అఫీషియల్ రీమేక్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు యువకులు మనుషుల అక్రమ రవాణా గ్యాంగ్ అటకట్టించడమే కథ. యాక్షన్, కామెడీ అంశాలతో మిడ్ నైట్ రన్నర్స్ చిత్రం తెరకెక్కింది. ఒరిజినల్ వర్షన్ లో ఇద్దరు పురుషులు హీరోలుగా నటించారు. కానీ తెలుగు రీమేక్ లో నివేద, రెజీనా లీడ్ రోల్స్ లో నటించనుండడం ఆసక్తిగా మారింది.

బహుశా కథలో మార్పులు చేశారేమో. రెజీనా, నివేదా ఇద్దరూ పెర్ఫామెన్స్ విషయంలో ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఇద్దరూ నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటున్నారు.

రెజీనా తెలుగులో చివరగా ఎవరులో నటించింది నెగిటివ్ షేడ్స్ లో ఆ చిత్రంలో రెజీనా అదరగొట్టేసింది. ఇక నివేదా థామస్ వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి నటిస్తే ఎలా ఉండబోతోందో త్వరలోనే చూడనున్నాం. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. మిక్కీ జె మేయర్ స్వరాలు అందిస్తున్నారు.

More News

నిద్రలోనే తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి జయంతి!

సీనియర్ నటి జయంతి అంటే తెలియనివారుండరు. సోమవారం ఉదయం ఆమె మరణ వార్తతో అభిమానులు మేల్కోవాల్సి వచ్చింది.

ఆకాష్ పూరీ 'చోర్ బజార్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’.

విజయ్ ఆంటోనీ దర్శకుడిగా బిచ్చగాడు 2 ..!!

తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు.

నా ఫేవరెట్‌ ఆలీగారు పెద్ద సక్సెస్‌ కొడతారు - సమంత అక్కినేని

ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’

విడుద‌ల‌కు సిద్ద‌మైన 'న‌ల్ల‌మ‌ల‌'

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.