close
Choose your channels

ఆగని ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు.. మరొకరు మృతి

Saturday, April 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ ఇంటర్ ఫలితాలు అనేక మంది విద్యార్థుల మరణాలకు కారణమయ్యాయి.!. ఇంటర్‌లో తప్పామని.. ఆశించిన మార్కులు రాలేదని ఇలా పలు కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు, తోబుట్టువులకు విషాదం నింపుతున్నారు. బిడ్డను పై చదువులు చదివించి ప్రయోజకులను చేయాలన్న తల్లిదండ్రుల ఆశలను ఆదిలోనే తుంచేసి క్షణికావేశంలో విద్యాకుసుమాలు నేలరాలిపోతున్నాయి!. తెలంగాణలో ఇప్పటికే సుమారు 20మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

తాజాగా.. నారాణ్‌పేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రేన్‌పల్లికి చెందిన శిరీష అనే ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వెంకట్రామిరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె అయిన శిరీష మహబూబ్‌నగర్‌‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదవుతోంది. అయితే తాజాగా వచ్చిన ఇంటర్ ఫలితాల్లో జువాలిజీలో ఫెయిల్ అయ్యిందని తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిద్దెపైకెళ్లి కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం మిద్దెపై నుంచి కింది దూకడంతో అక్కడికక్కడే శిరీష చనిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు తల్లిదండ్రులంతా పొలం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే.. ఇంటర్‌ ఫెయిల్ అయితేనే అంతా అయిపోయిందనుకుని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్పు.. దేవుడిచ్చిన నిండు ప్రాణాలను చేతులారా తీసుకోవడం బాధాకరం. పరీక్షలే కదా ఫెయిల్ అయ్యింది.. లైఫ్ కాదు కదా.. ఒకసారి తప్పితే మరోసారి రాసుకోవచ్చు అంతేకాను దానికి ఆత్మహత్యే శరణ్యమనుకుంటే ఎలా.. అని ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విద్యార్థులకు సూచనలు చేసిన సంగతి విదితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.