పవన్ కు అంతర్జాతీయ పురస్కారం

  • IndiaGlitz, [Tuesday,September 26 2017]

హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అంత‌ర్జాతీయ పుర‌స్కారం ల‌భించింది. ఇటీవ‌ల అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ గౌర‌వించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు ఐఈబీఎఫ్ (యూరోపియ‌న్ బిజినెస్ ఫోర‌మ్‌) అందించే ఎక్స‌లెన్స్ అవార్డుకు ప‌వ‌న్ ఎంపిక‌య్యారు. న‌వంబ‌ర్ 17న ఈ అవార్డును ప‌వ‌న్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అందుకోనున్నారు.

వివిధ రంగాల్లో సేవ‌లందించిన వారికి ఈ అవార్డును బ‌హుక‌రిస్తారు. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా కోట్ల మంది అభిమానం చూర‌గొన్న ప‌వ‌న్‌కు ఈ అవార్డును ఇవ్వాల‌ని ఐఈబీఎఫ్ నిర్ణ‌యించింది. ఈ మేర ఐఈబీఎఫ్ ఇండియా ప్ర‌తినిధి చంద్ర‌శేఖ‌ర్ ప‌వ‌న్‌ను క‌లిసి ఆహ్వానం అంద‌జేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాదిమంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్‌ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, కృషి అంద‌రినీ ఆకట్టుకుంద‌ని వారుతెలిపారు.

More News

ఎన్టీఆర్ అదరగొట్టాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ.

2500 థియేటర్స్ లో స్పైడర్?

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో

ఎన్టీఆర్..విమర్శకులపై నోరు జారాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం 'జై లవకుశ'.

'స్పైడర్' కోసం ఎగ్జయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నాను - మహేష్

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

మూడు సినిమాల‌తో రాశి

తాజాగా విడుద‌లైన ఎన్టీఆర్‌ జైల‌వ‌కుశ‌లో  ప్రియ పాత్ర‌లో సంద‌డి చేసింది రాశి ఖ‌న్నా. అందులో ట్రింగ్ ట్రింగ్ అంటూ సాగే పాట‌లో త‌న అందాల‌తో కుర్ర‌కారుని క‌వ్వించింది. ఇదిలా ఉంటే.. వ‌చ్చే నెల‌లో ఈ ముద్దుగుమ్మ న‌టించిన మూడు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.