మే 26న విడుదల కాబోతున్న 'ఇంతలో ఎన్నెని వింతలో'

  • IndiaGlitz, [Friday,April 28 2017]

టాలెంటెడ్ హీరో నందు నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇంతలో ఎన్నెని వింతలో విడుదలకి ముస్తాబవుతోంది. హరి హర చలన చిత్ర పతాకం పై తెరకెక్కిన ఈ సినిమాతో వి.వి.వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహం తో చిత్రాన్ని కూడా మే 26న విడుదల చేసి సక్సెస్ అందుకుంటామని దర్శకనిర్మాతలు అంటున్నారు..

ఇప్పటివరకు టాలీవుడ్ లో రాని ఓ ఢిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందినట్లుగా చిత్ర బృందం తెలిపింది. నూతన దర్శకుడు అయినప్పటికి వరప్రసాద్ ఈ సినిమాని ప్రేక్షకుల్ని అలరించే రీతన తీర్చిదిద్దనట్లు యూనిట్ సభ్యలు చెబుతున్నారు. వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరో నందుతో పాటు స్వామిరారా ఫేమ్ పూజారామచంద్రన్ కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనతం త్వరగా వాటిని ముగించి ఈ మండు వేసవిలోప్రేక్షకుల్ని హాయిగా అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా దర్శకుడు వరప్రసాద్ తెలిపారు.

More News

మహేష్ ఆలస్యానికి అసలు కారణమిదే..

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్నస్పై థ్రిల్లర్ 'స్పైడర్'.

బాహుబలిని ఆకాశానికెత్తేసిన ఎన్టీఆర్...

విజువల్ వండర్ గా రూపొందిన 'బాహుబలి 2' సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మెగాభిమానులు, ప్రభాస్ అభిమానుల మధ్య ఘర్షణ

బాహుబలి2 విడుదల సందర్భంగా అమలాపురంలో మెగాభిమానులు,ప్రభాస్ అభిమానులు మధ్య ఘర్షణ జరిగింది.

'బాహుబలి 2' ట్రెండ్ క్రియేటర్...

ప్రభాస్,అనుష్క,రానా,తమన్నాతారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో

'అమ్మాయి ప్రేమలో పడితే' ప్రారంభం

హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం 'అమ్మాయి ప్రేమలో పడితే'.